నాటకదీపము.
శ్రీసాయినాథాయనమః " తమసోమా జ్యోతిర్గమయా " నేడు కార్తీకపౌర్ణమి, వెలుగువైపు ప్రయాణానికి సంకేతం ! ( దీపాన్నిగూర్చి ఆధ్యాత్మ పరంగా " పంచదశి " యను వేదాంతగ్రంధంలో చెప్పబడిన కొన్ని ఆసక్తికర విషయముల నిచట చర్చించడమైనది. ) " జీవితం ఓ రంగస్థలం, మనుషులంతా పాత్రధారులే ! " విలియం షేక్స్పియర్ శిరిడీసాయిబాబా సద్గ్రంథపఠనమును మిగుల ప్రోత్సహించేవారు. తమ తమ విరామసమయంలో వివిధభక్తులు భావార్ధరామాయణము, జ్ఞానేశ్వరి, ఎకనాథభాగవతము, భగవద్గీతాది సద్గ్రంధాలను చదువుచూ తోటివారికి వినిపించెడివారు. దాదాసాహెబ్ ఖాపర్డే అమరావతికి చెందిన ప్రఖ్యాత లాయరు, విద్యావేత్త, స్వాతంత్ర్యోద్యమకారుడు, తిలక్ కు కుడిభుజంలాంటివాడు. అతడు శిరిడీలో నాలుగుమాసములుండి బాబాను మిగులసేవించిన ధన్యాత్ముడు. ఖాపర్డే విద్యారణ్యస్వామిచే 14వ శతాబ్దంలో వ్రాయబడిన పంచదశి యనెడి ఆధ్యాత్మగ్రంధము చదువుచూ యితరులకు వివరించెడివారు. పంచదశి 15 అధ్యాయములతోకూడిన అద్వైతవేదాంతగ్రంధము సంస్కృతభాషలో వ్రాయబడినది. అందు 10వ అధ్యాయముపేరు నాటకదీపము, పాఠకులకులకు మిగులప్రియమైనది. ఈఅధ్యాయంలో ని...