శ్రీసాయిసందేశామృతము 2(Nectar of Sri Sai's message 2).
శ్రీసాయినాథాయనమః. నేడు పూజ్యశ్రీ ఎక్కిరాల భరద్వాజ 87వ జయంతి పర్వదినము. సాయిబాబ తమ శుభసందేశాలనే కిరణాలతో భక్తుల హృదయాల్లో వెలుగులనింపి చైతన్యవంతం చేస్తున్నారు . బాబాసందేశాలనాచరిస్తూ జీవితాన్ని చరితార్థం చేసుకుందాము. శ్రీసాయిసందేశామృతము : అధ్యాయము 2. సాయిలీలలు వినోదంతోపాటు విజ్ఞానాన్ని సంతోషాన్ని కల్గిస్తాయి. ఆపారవశ్యంతోనే రచయిత అన్నాసాహెబ్ దబోల్కర్ సాయిమహిమలను గ్రంధస్తం జేశాడు. ఆత్మస్థాయి నిండి వెలువడే సాయి దైవలీలలు సాధారణ మానవుల మానసిక తర్కానికందనంత దూరంగా ఉంటాయి. మరి అలాంటి సాధారణ మనసుతో అసాధారణ గ్రందాన్నెలా రచించాడు? అదే గురుమహిమ,సద్గురుసాయి కృప. ప్రేరణ సాయిది, రచయితా సాయియే! అన్నాసాహెబ్ కేవలం ఉపకరణమాత్రమే. సాగర అలలుగా సాయిలీలలు నిత్యనూతనములు, సత్యబోధకములు. శోధించేకొలది సాధకునికి నూతనభావాలు ఆవిష్కృతమౌతాయి. సాయిపలుకులు ఆత్మలోతులనుండి వెలువడే వెలుగుకిరణాలు.రచయిత తన అహంకారాన్ని గురుచరణాల సర్వసమర్పణజేసి గ్రంథరచనకు కావలసిన శక్తిని,బుద్ధిబలాన్ని సంతరించుకొన్నాడు. రచనజేయు తన తలుపును అత్యంత భక్తుడు శ్యామా ద్వారా విన్నవించుకొని బాబా నుండి యూది, అశీసులు పొందాడు. వాని అహం సూన్యమైనపిమ...