'' మాటకై ప్రాణమిస్తాను '' సాయిబాబా !
ఓంశ్రీసాయిమాత్రేనమః పాఠకభక్తులెల్లరకు విజయదశమి శుభాకాంక్షలు! ( శిరిడీలో ఓభక్తునికి సాయి ' బాల ' గా దర్శనమిచ్చారు.) నేడు సాయిబాబా మహాసమాధి పుణ్యతిధి. " శరీరమే తామను భ్రమించే పామరులకు జనన మరణాలుంటాయి. మృత్యువుపై విజయం సాధించినవారే మహాత్ములు. సాయి సశరీరులుగా వున్నప్పుడే మనలా శరీర పరిమితులుగా లేరు, అన్నిరూపాలలో వున్న పరమాత్మగా జీవించారు. అలాంటివారికి మరణమెలా సంభవం? ". ఆచార్యవాణి '' మాటనిలుపుటకై, నాప్రాణమిస్తాను '' సాయిబాబా ! ద్వారకామాయిలో తమను సందర్శింపవచ్చిన భక్తులతో సాయిబాబా తరచుగా , " నేను మజీదులో కూర్చుని సత్యమునే పలికెదను, నా భక్తులరక్షించుటకై వేలమైళ్ళు వెళ్లెదను, సప్తసముద్రముల దాటెదను, చివరికి నావాణ్ణి కాపాడుటకై ప్రాణములసయిత మిచ్చెదను." యని పలుకుచుండెడివారు. సాయి మాటలు నూటికి నూరుపాళ్లు సత్యమని ధ్రువపరచుటకు శ్రీసాయి సచ్చరిత్ర లో పెక్కు ఉదాహరణలున్నాయి ఆయా విషయాలను క్లుప్తంగా స్మరించుకొందాము, ఏలయన స్మరణముకూడ నవవిధభక్తులలో ఓ భక్తిమార్గంగా చెప్పబడినదికదా! ముందుగా శ్రీసాయి సచ్చరిత్రములోని 40వ అధ్యాయములొ చెప్పబడిన ఓ అద్భుత సంఘటన చూచెదము....