గురుపూర్ణిమ.
శ్రీసాయినాథాయనమః నేడు పవిత్ర గురుపూర్ణిమ. గురుపూర్ణిమ పరిపూర్ణ సద్గురుతత్వానికి, జ్ఞానానికి సంకేతమని విజ్ఞులు చెబుతారు. విష్ణుభగవానుని అంశగా జన్మించిన వేదవ్యాసమహర్షి ఇదేసుదినమున ఆవిర్భవించుటచే ఈరోజు వ్యాసపూర్ణిమగా ప్రాచుర్యము పొందినది. గౌతమబుద్ధుడు పూర్ణిమరోజునే జన్మించాడు, పూర్ణిమరోజునే నిర్వాణము లేక ఆత్మసాక్షాత్కారం పొందాడు మరల పూర్ణిమరోజునే నిర్యాణం చెందాడు. పవిత్రసిక్కుమత స్థాపకుడు గురునానక్ పూర్ణిమదినముననే అవతరించాడు. ఈవిధంగా పూర్ణిమ వ్యక్తియొక్క ఆధ్యాత్మిక జీవనంలో ప్రముఖ సంకేతస్థానాన్ని సంతరించుకొంది. సమర్ధసద్గురు శ్రీసాయినాథులు స్వయంగా భక్తులకు చేసుకోమని చెప్పినది గురుపూర్ణిమ పండుగను మాత్రమే! ప్రస్తుతవ్యాసంలో శిరిడీలో జరుగుగురుపూర్ణిమ యెలా ఆరంభమైనదో తెలుపు వివరాలను పరిశీలించెదము. పూజ్య ఆచార్యభారద్వాజ మాస్టరుగారు రచించిన శ్రీసాయిలీలామృతమునుండి ప్రస్తుత విషయములను గ్రహించడమైనది. " ఓరోజు 1908వ సంవత్సరములో, పండరినుండి వచ్చిన కృష్ణాజీ నూల్కర్ చావడిలో వున్నాడు. బాబా శ్యామాతో " ఆముసలయ్య (నూల్కర్) ను ధునివద్ద స్తంభాన్ని పూజించుకొమ్మని చెప్పు " అని అతడు చెప్ప...