Posts

Showing posts from October, 2021

సాయిబాబా- నిత్యసత్యుడు, అనంతశక్తిస్వరూపుడు.

Image
శ్రీసాయినాథాయనమః! పాఠకభక్తులెల్లరకు విజయదశమి శుభాకాంక్షలు! శ్రీసాయిబాబా శివ, శక్తి తత్వముల తనలో పరిపూర్ణముగ నింపుకొన్న మహాశక్తిస్వరూపుడు! నేడు బాబా మహాసమాధిచెందిన పుణ్యతిధి, 103 సంవత్సరములపూర్యము బాబా తమభౌతికరూపము చాలించారు. కాని సాయిబాబా నిత్యసత్యులు, ఈవిషయమై ముందుగా శ్రీసాయిసచ్చరిత్రము ఉపోద్ఘాతమున చెప్పబడిన కొన్ని అక్షరసత్యవాక్యముల స్మరించెదము. శ్రీ బీ.వీ . నరసింహస్వామిగారు తమ 'భక్తులయనుభవములు' పుస్తకము మొదటిపేజీలో ఓ హైకోర్టు జడ్జిగారి యనుభవమిలా వ్రాసారు. " నేను సాయిబాబాను సృష్టిస్థితిలయకారకుడుగా భావించెదను. 1918వ సంవత్సరములో వారుసమాధిచెందకముందు నేనట్లు భావించితిని. ఇప్పటికి నేనటులే భావించుచున్నాను. నాకుమాత్రము వారు సమాధిచెందినట్లు లేరు. నాదృష్టిలో వారు అన్నిపరిమితులకు అతీతులు. వారు మామధ్య యున్నప్పుడు వారిమానవశరీరము మాకనులముందు సంచరించుచుండెను. ఒక్కొక్కప్పుడది మాదృష్టిని విశేషముగా నాకర్షించెడిది. కాని ఎక్కువభాగము మా ఎరుకలో నిలబడినదిమాత్రము వారి అనంతతత్వమే. శాశ్వతము-అశాశ్వతముల అద్భుతసమ్మేళన రూపమైన యొక మానసిక ప్రతిబింబమువలే వారు మాకు భాసించేవారు.అశాశ్వతమైన తమమానవ...

పవర్ అఫ్ అటార్ని !

Image
శ్రీసాయినాథాయనమ! శ్రీరామకృష్ణాయనమః! " పవర్ అఫ్ అటార్ని" అంటే ఏమిటో సాధారణంగా అందరికి తెలిసినవిషయమే. న్యాయస్దాన పరమగు తనసర్వహక్కులను వేరొకరికి సమర్పించుట. ముఖ్యముగా ఆస్తిపాస్తుల రిజిస్ట్రేషన్ వ్యవహారాలలో ఓ వ్యక్తి తాను స్వయంగా హాజరుకాలేనపుడు తనతరఫున నమ్మకమైన వేరొకవ్యక్తికి తన పూర్తిహక్కులను సమ్పరిస్తాడు. రెండవవ్యక్తి మొదటివ్యక్తి తరఫున పనిపూర్తిజేస్తాడు. ఇదే విషయం ఆధ్యాత్మికరంగంలో గురుశిష్యులకు కూడ వర్తిస్తుందనేది ప్రస్తుత వ్యాసములోని విషయము. శిష్యుడతనతనగురువునెలా సేవించాలో తెలిపే ఆధ్యాత్మిక అంశములుండుటచే భక్తులకిది సహాయకారి కాగలదని తలచి వ్రాయడమైనది. శ్రీరామకృష్ణ పరమహంస మరియు ఆతని ప్రియశిష్యుడు గిరీష్ చంద్రఘోష్ లకు సంబంధించిన విషయమిది.అప్పట్లో గిరీష్ (1844-1912)బెంగాల్ రాష్ట్రంలో మిగుల పేరొందిన రంగస్థలనటుడు కళాకారుడు రచయిత దర్శకుడు.ఇతడు శ్రీరామకృష్ణను పెక్కుమార్లు దర్శించి వారికి మిగుల సన్నిహితభక్తుడైనాడు. ఓ రోజు గిరీష్ పరమహంసనిలా అడిగాడు, " స్వామీ! ఇప్పటినుండి నేనెలాంటి సాధనచేయాలి? " అందులకు శ్రీరామకృష్ణ సమాధానంగా " ప్రస్తుతం జీవనమే కొనసాగించు. ఓ చేత్...

సాయిలీలా విశ్లేషణ - సర్వస్యశరణాగతి.

Image
శ్రీసాయినాథాయనమః. శ్రీసాయిసచ్చరిత్రలో పెక్కుమంది సాయి అంకితభాక్తులగాథలను చూడగలము. వారెల్లరు సాయిబాబాను తమదైవంగా భావించి పూజించేవారు. ఓసందర్భంలో సాయి వారి భక్తినిపరీక్షింపదలచి ఓ చిన్న పరీక్ష పెట్టారు. ఈవివరములన్నియు పాఠకులు 23వ అధ్యాయమున చూడగలరు. ఒకప్పుడు శిరిడీలో కలరావ్యాధి మిగుల వ్యాపించినది. ఆకారణంగా గ్రామపెద్దలు వ్యాధి నిర్మూలనకై రెండు షరతుల విధించారు. గ్రామస్తులు కట్టెలుకొనరాదు, మేకను కోయరాదనెడివి ఆ నియమాలు. ఆచట్టములు చాదస్తమనితలఁచి బాబా వాటిని లక్ష్యపెట్టక తమ నిత్యధునినిర్వహణకై కట్టెలు కొన్నారు. రెండవ నియమోలంఘన ప్రస్తుత చర్చయనియాంశ విషయము. నిబంధనలమలులో నున్నపుడు యెవరో చావుకుసిద్ధమైన ఓముసలి మేకను ద్వారకామాయికి తెచ్చారు. తమభక్తుల విశ్వాసాన్ని పరీక్షింపదలచి బాబా ఓచక్కని కథనడిపారు. బాబాచే మిగులగౌరవము పొందువాడు మిగులసన్నిహితుడగు బడేబాబాతొ ఆ మేకను నరుకవలసినదిగా సాయి చెప్పారు. కాని కారణమేమీలేక మేకనుచంప బడేబాబా నిరాకరించాడు. అప్పుడు సాయిబాబా శ్యామాను ఆపనిచేయమన్నారు. శ్యామా రాధాకృష్ణమాయివద్దకుపోయి కత్తిదెచ్చి బాబాముందు పెట్టాడు. విషయముతెలిసిన రాధాకృష్ణమాయి కత్తినితెప్పించుకొన్నది. మరొ...