Posts

Showing posts from November, 2019

సాయి కథలు - గురుస్పర్శ ప్రభావము 1

Image
శ్రీసాయినాథాయనమః సాయి కథలు - గురుస్పర్శ ప్రభావము 1 " మహాత్ముల కథలు వినుటయనగా వారి సాంగత్యము  చేయుటే " శ్రీ సాయి సచ్చరిత్రము " సాయి తన హస్తమును భక్తుల తలపై పెట్టి తమ శక్తులను వారిలోనికి పంపించి  భేదభావమును నశింపజేసి, అప్రాప్యమును ప్రాప్తిపజేయును." బాబా సపత్నేకర్ తలపై హస్తముంచి యోదార్చి యిట్లనియె. " ఈ పాదములు ముదుసలివి, పవిత్రమైనవి. ఇక నీ కష్టములు తీరిపోయినవి. నాయందే నమ్మకముంచుము. నీ మనోభీష్టములు నెరవేరును. "  సంతానలేమిచే దుఃఖపడు యాతనికి ఒక సంవత్సరములో కొడుకు పుట్టెను.     గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః  గురుదేవో మహేశ్వరః  గురుస్సాక్షాత్  పరబ్రహ్మా  తస్మై శ్రీగురవేనమః ( గురువే బ్రహ్మ, గురువే విష్ణు, గురువే మహేశ్వరుడు, గురువే సాక్షాత్తు విశ్వ మూలకారణ పరబ్రహ్మ.  అలాంటి గురువరేణ్యునకు నా నమస్కారములు.) శరణం శరణం గురుచరణం  శరణం శరణం  శరణం శరణం  సాయీచరణం ...శరణం శరణం  భవభయహరణం  బహుశుభకరణం  బాబాచరణం   పావన తీర్ధం                  ...

సాయి కథలు - పై లోకాలున్నయ్యా ?

Image
శ్రీసాయినాథాయనమః సాయి కథలు -  పై లోకాలున్నయ్యా ? " మహాత్ముల కథలు వినుటయనగా వారి సాంగత్యము  చేయుటే " శ్రీ సాయి సచ్చరిత్రము ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపలనుండు లీనమై  ఎవ్వనియందుడిందు పరమేశ్వరుడెవ్వడు? మూలకారణం  బెవ్వ? డనాది మధ్య లయుడెవ్వడు?  సర్వము తానె యైన వా  వాడెవ్వడు వాని నాత్మభవు నీశ్వరు నే  శరణంబు వేడెదన్                గజేంద్రమోక్షము, శ్రీమద్భాగవతము  ఓ పర్యాయము బాబా ప్రియభక్తుడు శ్యామా తనకు బ్రహ్మాది లోకాల జాపమని సాయిని పట్టుబట్టాడు. భగవంతునిముందు అవి అల్పాలని, అశాశ్వితాలని, వాటిని పట్టించుకోవద్దనీ చెప్పినా అతడు వినలేదు. బాబా అతనిని కళ్ళు మూసుకోమన్నారు. అతనికి ఆయాలోకాలు కన్పిస్తుంటే బాబా, సత్యలోకంలో బ్రహ్మను, వైకుంఠంలో విష్ణువును, కైలాసంలో శివుణ్ణి జూపి , " మనం కోరవలసినది వీటికతీతమైనది. " అన్నారు.  శ్రీ సాయిలీలామృతము  పైనున్న లోకాలగురించి  రామకృష్ణ పరమహంస గాంచిన అద్భుత దృశ్యము. శ్రీరామకృష్ణుల మాటలలోనే వారు గాంచిన అద్భుతదృశ్య వివరములు, " ఒకరోజు సమాధిస్థిత...

సాయి కథలు - " నా వాణ్ణి పతనం కానివ్వను! "

Image
శ్రీసాయినాథాయనమః  సాయి కథలు - " నా వాణ్ణి పతనం కానివ్వను!  "  తమభక్తులనెపుడూ పడిపోవనీయనని సాయినాథులు అభయమిచ్చినారు. కోపతాపాలనుండి, కామ లోభాలనుండి భక్తుల విచిత్రరీతుల రక్షించారు. హరి వినాయక్ సాఠే బాబాకు గొప్పభక్తుడు. శిరిడీలో  సాయినిదర్శించు వారలనివాసమునకై   మొట్టమొదట  సాఠేవాడ  నిర్మించాడు. సాఠే ప్రవర్తనను సాయి యెలా చక్కదిద్దారో పరిశీలిద్దాము. తమమామ దాదాకేల్కర్ సలహాపై శిరిడీలో ఇరువది ఎకరాల పొలము కొన్నాడు సాఠే. ఆ భూమిని తనభార్యతో కలసి చూచుటకై తాత్యానుండి ఎద్దులబండి తెప్పించాడు. భార్య మొదట అంగీకరించినదికాని, తర్వాత తండ్రిమాటపై చూచుటకు రానన్నది. తనమాటవినలేదన్న మిగుల కోపంతో ఆమెను దండించుటకు చెర్నాకోలు తీసుకొన్నాడు. అదేసమయాన మేఘుడు పరుగులవచ్చి వెంటనే బాబా రమ్మన్నారన్న వార్తను సాఠేకు తెలియజేస్తాడు. సాయిని సందర్శించిన సాఠేతో బాబా, ' ఏమిటి విషయం, ఏమైనది? నీభూమి అక్కడే వుందిగా, చూచేదేమిటి? ' అన్నారు. సాఠే ప్రవర్తనపట్ల సాయి యెంతటి అప్రమత్తులోకదా! మరొక సంఘటన. ఒకరోజున మొదటిసారిగా శిరిడీలో ఓభక్తురాలి యింటికి వెళ్లదలచాడు సాఠే. సరిగా అంతకు కొద్దిసేపటికి మ...

సాయి కథలు - ఆహారశుద్ధి

Image
శ్రీసాయినాథాయనమః  సాయి కథలు - ఆహారశుద్ధి  " మహాత్ముల కథలు వినుటయనగా వారి సాంగత్యము  చేయుటే " శ్రీ సాయి సచ్చరిత్రము           ఆత్మశుద్ధిలేని ఆచారమదియేల ?  భాండశుద్ధిలేని పాకమేల?  చిత్తశుద్దిలేని శివపూజలేలరా?  విశ్వదాభిరామ వినురవేమ.                                                           ఆహారవిషయమై మహాత్ముల అభిప్రాయములను, భగవద్గీత సందేశమును తెలిసికొందము.  ముందుగా సాయిబాబా యీవిషయమై ఏమిచెప్పారో చూచెదము.  " ఒక అనుభవములేని యోగసాధకుడు, నానాసాహెబు చాందోర్కరునితో కలసి మసీదుకుబోయి సాయిను జూచుసరికి  బాబా ఉల్లిపాయతో రొట్టె తినుచుండిరి. దీనిని చూడగనే అతనికి మనస్సున ఒక యాలోచన మెదలెను. ' రుచిలేని రొట్టెను పచ్చి యుల్లిపాయతో తినువాడు నాకష్టముల నెట్లు తీర్చగలడు? నన్నెట్లు ఉద్ధరించగలడు? ' సాయిబాబా యతని మనసున మెదిలిన ఆలోచనను గ్రహించి , నానాసాహెబుతో నిట్లనియెన...

సాయి కథలు - ఆ అగంతుకుడెవ్వరు ?

Image
శ్రీసాయినాథాయనమః  సాయి కథలు - ఆ అగంతుకుడెవ్వరు ? " దైవసహాయం తెలియనివ్యక్తులద్వారాకూడా లభింపగలదు. "  " మహాత్ముల కథలు వినుట యనగా వారి సాంగత్యము చేయుటే ! " శ్రీ సాయి చరిత్రము " సద్గురుని వెదుకుటలోను ఆధ్యాత్మిక కృషియందును దేవుడు భక్తులకు సహాయపడుననునది భక్తుల యనుభవమే! "  శ్రీ సాయి చరిత్రము దైవసన్నిధికి, సద్గురుదర్శనానికి వెళ్లునప్పుడు  అదృశ్యరూపంలో  అనుకోని విధంగా  భగవంతుని లేక సద్గురుని  సహాయం లభిస్తుంది. ఇందులకు శ్రీ సాయి చరిత్రములో పెక్కు ఉదాహరణములున్నవి, మరియు ఇది యెంతోమంది భక్తుల యనుభవముకూడాను. 1910 లో అన్నాసాహెబ్ దభోల్కర్ ( హేమాడ్ పంత్ ) తనమిత్రుడు నానాసాహెబ్ చందోర్కర్ సలహాపై సాయిబాబాను చూచుటకై శిరిడీ ప్రయాణమౌతాడు ( 2వ అధ్యాయము ). బాంద్రానుండి దాదరు వెళ్లి అచటినుండి మన్మాడు రైలులో వెళ్లదలచి ముందుగా దాదరు వరకు టిక్కెటు కొన్నాడు. రైలు బయలుదేరు సమయమున ఎలాంటి పరిచయములేని మహమ్మదీయుడొకడు పంతు విషయము దెలిసికొని మన్మాడు వెళ్ళు  రైలు దాదరులో ఆగదు గావున , ముందుకుబోయి బోరీబందరు స్టేషన్లో దిగమని సలహానిచ్చాడు. ఆప్రకారమే ప్రయాణంజేసి అనుకొన్న...