Posts

Showing posts from May, 2019

సాయి కథలు - అణుకువ , అహంకారము

Image
శ్రీసాయినాథాయనమః  సాయి కథలు -  అణుకువ,అహంకారము  సాయిబాబా తాము స్వయంగా అణుకువలో అగ్రేశ్వరులు. ఈవిషయం వారివేషభాషలలోను, వారి నిత్యజీవనవిధానంలోనూ స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. వారిమాటలు సయితము మిగుల క్లుప్తము. చిరుగుల కఫనీ, చేతిలో సట్కా , భిక్షాటనకు పాత్ర ఇవే వారి సంపద. పాతమజీదే వారి రాజమహలు. ఎల్లప్పుడూ " అల్లా మాలిక్ "  అంటూవుండేవారు. తాము దేవుని నమ్మినబంటుగానే చెప్పుకున్నారేగాని, తమకు తాము దైవంగా ఎప్పుడూ ప్రకటించుకోలేదు. భక్తులకు తాను సేవకుడనని చెప్పుట సాయిబాబావారి యణుకువకు, వారి నిరహంకారానికి పరాకాష్ట.  అణుకువ, వినయములాంటి దైవగుణాలు  భక్తులు కలిగియుండాలని , సాయి మనకు చెప్పకనే  చెప్పారు. అదేవిధంగా అభిజాత్య, దురహంకారములతో తమవద్దకు వచ్చినవారిని సాయి తీవ్రంగా నిరసించేవారు. ఈవిషయమై శ్రీసాయిసచ్చరిత్రములోని 11వ అధ్యాయ విషయముల పరిశీలించెదము. బాబా భక్తుడు తాత్యాసాహెబు నూల్కరు తమ చివరిరోజుల్లో శిరిడీలో  నివసించాడు. వాని స్నేహితుడు డాక్టరు పండితు యనునతడు బాబాను చూడ శిరిడీ వచ్చి నమస్కరించిన పిమ్మట  వానిని సాయి,  దాదాభట్ కేల్కరు యింట...

సాయికథలు - చంచల గుఱ్ఱము (Restless Mind.)

Image
శ్రీసాయినాథాయనమః  సాయికథలు -  చంచల గుఱ్ఱము  తేది 12-12-1909న సాయిబాబా ఓకథ చెప్పారు. " ఒకడికొక అందమైన గుఱ్ఱముండేది. వాడెంత శ్రమించినా అది జంట గుఱ్ఱంతో కలిసి పనిచేయలేదు. దానినెన్ని దేశాలు తిప్పినా ప్రయోజనం లేకపోయింది. ఎంత శిక్షణ నిచ్చినా అదిలొంగలేదు. చివరికొక పండితుడు దాని నెక్కడ నుంచి తెచ్చారో అక్కడికే తీసుకు పొమ్మని సూచించాడు. అలా చేయగానే ఆ గుఱ్ఱం సక్రమంగా పనిచేయ నారంభించింది. "     ఖాపర్డే డైరి వివరణ: అందమైన గుఱ్ఱమంటే వాసనలతో మదించిన మనస్సు. జంటగుఱ్ఱమంటే మంత్రమని చెప్పవచ్చు. యోగపరిభాషలో ప్రాణచలనమని చెప్పవచ్చు. దానితో కలసి మొదటి గుఱ్ఱం పనిచేయక పోవడమంటే నిరంతర మంత్ర జపంలో లయించక, పరిపరివిధాల పరుగులు పెట్టడమన్నమాట. లేక యోగ పరిభాషలో శ్వాసక్రియతో ఐక్యతచెందక పోవడమని చెప్పాలి! ఎన్ని సాధనమార్గాలూ దానికి ఉపకరించలేదు. ఒకపండితుడు - అంటే   భగవద్గీతలో చెప్పినట్లు జ్ఞాని - చేసిన సూచన కర్ధం మనస్సును దాని పుట్టుక స్థానం మీద కేంద్రీకరించమని, 'మనస్సనేది ఏది? అదెక్కడ ఉదయిస్తుంది?'  అని పరిశీలించడమన్నమాట. అలాచేస్తే మనస్సు లయిస్తుందని భగవాన్ రమణమహర్షి కూ...

అడ్డుగోడ

Image
శ్రీసాయినాథాయనమః  అడ్డుగోడ  కాకామహాజని సాయిబాబాకు ప్రియభక్తుడు. బొంబాయిలోని చౌపటిలో నివసిస్తుండేవాడు. అతడు ఓసారి బాబాను చూడ శిరిడీ వెళ్లుచూ తనమిత్రునిగూడ రమ్మంటాడు. కాని మిత్రునికి బాబాపై అంతటి నమ్మకంలేదు. తుదకు బాబాకు నమస్కరించను, యెలాంటి దక్షిణివ్వను యను రెండు షరతులపై శిరిడీకి ప్రయాణమవుతాడు. శనివారం బయలుదేరి ఆదివారముదాయానికి ద్వారకామాయి జేరుతారు. తనను మామూలుమనిషిగా తలచు యిలాంటి వ్యక్తులతో బాబా వ్యవహరించు తీరు యమోఘము. స్నేహితుడు మెట్లెక్కుచూ  యింకను బాబాను సమీపించలేదు, చూడలేదు. కాని మరణించిన తనతండ్రి మధురమైన స్వరంతో మంచిమాటలతో బాబా వానిని  లోనికి ఆహ్వానించారు. ఆకర్షణశక్తిగల  తనతండ్రి కంఠధ్వనిని విన్న మిత్రుడు మిగుల సంతోషపడి లోపలకువెళ్లి  తనమనోనిర్ణయానికి విరుద్ధంగా  బాబా పాదములకు నమస్కరిస్తాడు.  ఇక రెండవ విషయం దక్షిణగూర్చి. సాయి కాకాను మరీయడిగి రెండుసార్లు దక్షిణ స్వీకరించారు. కాని స్నేహితుని యడుగలేదు. " బాబా నిన్నే రెండుసార్లు దక్షిణ యడిగెను, నీతోయున్న నన్నేల విడచినారు? " యని యాతడు కాకాచెవిలో గుసగుసలాడినాడు. సర్వజ్ఞులైన సాయి స్నేహితునిభ...

సాయి కథలు - రూపాయి దక్షిణ, పదిరూపాయల రక్షణ !

Image
శ్రీసాయినాథాయనమః సాయి కథలు -  రూపాయి దక్షిణ, పదిరూపాయల రక్షణ !  శ్రీసాయిసచ్చరిత్ర రచయిత హేమాద్ పంత్ యిలా అంటారు, " వేదపురాణాది సద్గ్రంధములు చదువునప్పుడు నాసద్గురు మూర్తియే యడుగడునకు జ్ఞప్తికి వచ్చుచుండును. నా సద్గురువైన శ్రీసాయిబాబాయే శ్రీరాముడుగా, శ్రీకృష్ణుడిగా నా ముందు నిలచి , తన లీలలను తామే వినిపింప జేయునట్లు తోచును. నేను భాగవత పారాయణకు పూనుకొనగనే శ్రీసాయి యాపాదమస్తకము కృష్ణునివలె గాన్పించును."  అలాగే  నేను ఏదేని బాబాలీల  చదువునప్పుడు ఆసన్నివేశానికి  సమాంతర కృష్ణలీల  మనస్సుకు వెంటనే స్ఫురిస్తుంది. సాయిబాబా మిగుల ఉదారులు, ఒక్కరూపాయికి పదిరూపాయలిత్తునని నమ్మబలికారు. ఇందుకు సంబంధించిన సందర్భము శ్రీసాయిసచ్చరిత్రము 35వ అధ్యాయములో లభిస్తుంది. బాబా తనప్రియ భక్తుడు కాకామహాజని నుండి 15 రూపాయలు దక్షిణపొంది అతనికిట్లు చెప్పిరి.  " నేను  ఒకరూపాయి దక్షిణ యెవరివద్దనుంచిగాని తీసికొనినచో దానికి పదిరెట్లు ఇవ్వవలెను. నేనూరక యేమి తీసికొనను. యుక్తాయుక్తములు తెలియక నేనెవరిని అడుగను. ఫకీరెవరిని  చూపునో వారివద్దనే నేను తీసికొనెదను. ఎవరైన ఫక...

సాయికథలు - శ్యామా మొక్కులు

Image
శ్రీసాయినాథాయనమః!  సాయికథలు -  శ్యామా మొక్కులు  శ్యామా సాయి బాబాకు  అత్యంత ప్రియభక్తుడు. ఎల్లప్పుడూ బాబాను వెన్నటియుండేవాడు.  ఆ శ్యామా తనబాల్యంలో జబ్బుపడినప్పుడు యాతనితల్లి తమగృహదేవతయగు వణిలోని సప్తశృంగికి,  జబ్బుతగ్గినంతనే బిడ్డను తెచ్చి ఆదేవి పాదములపెట్టెదనని మ్రొక్కుకొన్నది. కొంతకాలముపిమ్మట శ్యామాతల్లి  కుచములపై తామరవ్యాధిచే మిగుల బాధపడినది.  తనకునయమైతే రెండు వెండికుచముల సమర్పించెదనని మరల మొక్కొన్నది. కాని ఆరెండు మొక్కులు తీరకమునుపే, ఆమొక్కులుతీర్చు బాధ్యత శ్యామాపైనిడి యామె మరణించినది. శ్యామా ఆవిషయం ముప్పయిసంవత్సరములు మరచాడు. ఆసమయంలో కష్టాలు చుట్టుముట్టడంతో, దానికి   మొక్కులు మరచుటయే కారణముగా ఓ జ్యోతిషునిద్వారా  గ్రహిస్తాడు. మరింత ఆలస్యం ప్రమాదకరమని తలచి రెండువెండికుచముల చేయించి బాబాయే తనసప్తశృంగియని తలచి , తనమొక్కులు స్వీకరింపవలెనని బాబాను వేడుకొంటాడు. కాని శ్యామాయే స్వయంగా సప్తశృంగిని దర్శించి మొక్కులు దీర్చమని బాబా నిర్బంధిస్తారు. కావున శ్యామా బయలుదేరి వణిలోని దేవత పూజారి కాకాజీ వైద్య నింటికి వెళ్తాడు. చిత్రమేమంటే అ...

సాయికథలు - పరివర్తన

Image
శ్రీసాయినాథాయనమః  సాయికథలు - పరివర్తన  సాయిబాబా తమభక్తులలో మంచిమార్పు తెచ్చి  వారిని ఉన్నతమైన ఆధ్యాత్మిక మార్గంలో నడిపించుటకు వేరువేరు మార్గముల నవలంబించెడి వారు. ఈమార్గాలలో స్వప్నదర్శన, సందేశాలు ఒక ముఖ్యమైన మార్గము.  శ్రీసాయిసచ్చరిత్రములో చెప్పబడిన మద్రాసు భజనమండలివారి యనుభవములనొకసారి విశ్లేషించుకొనెదము. వీరిలో యజమాని, వానిభార్య, కుమార్తె, యాతని వదిన యున్నారు. రామదాసు పంథాకుచెందిన వీరు కాశీయాత్రకు వెళ్లుచు శిరిడీలోని సాయిబాబాను దర్శించి, వారినుండి  దక్షిణ పొందుటకై వచ్చి ద్వారకామాయిలో మంచిభజన చేసారు. యజమానురాలుతప్ప మిగిలిన మువ్వురూ  పేరాశపరులు. వారికి ధనమేముఖ్యం. ఓరోజు ఆరతి సమయంలో భక్తివిశ్వాసములుగల యజమానిభార్యకు, తన ఇష్టదైవమైన శ్రీరామచంద్రునిలా బాబా దర్శనమిచ్చారు. ఆమె  తన్మయురాలై మిగుల యానందము ననుభవించినది. కాని ఆమెది భ్రమయని, కేవలచాదస్తమని భర్త తృణీకరించాడు. అలాంటి విశ్వాసరాహిత్య భర్తలో బాబా ఎలాంటి పరివర్తన తెచ్చారో ఇపుడు చూద్దాం. ఓరోజురాత్రి  యాతనికి విచిత్రమైన కల వచ్చినది. పోలీసులు వానిచేతులుకట్టి ఓ పంజరంలో  బంధించారు. బా...

సాయిబాబా భగవంతుడే(నా) ?

Image
శ్రీసాయినాథాయనమః  సాయిబాబా భగవంతుడే(నా) ? ఈమధ్యకాలంలో ఈ ప్రశ్న ప్రసిద్ధిచెందిన కొందరి మఠాధిపతుల మనసులగూడా తొలుస్తోంది. ఈవిషయమై నిచట  భగవంతుడన  యెవ్వరను విషయాన్ని  పరిశీలించెదము. మనశాస్త్రములలో భగవంతునికి ఆరులక్షణములు చెప్పబడినవి. అవి వరుసగా 1) కీర్తి, 2) ధనము, 3) అభిమానము లేకుండుట, 4) జ్ఞానము, 5) మహిమ, 6) ఓదార్యము. ముందుగా హిందువులు పూజించెడి అవతార పురుషుల వివరముల నెరుగ ప్రయత్నించెదము.  హిందువులు ప్రముఖంగా శివ, రామ, కృష్ణ, హనుమ యిత్యాది దేవతల నారాధింతురు. ప్రస్తుతవ్యాసంలో మనచర్చ కేవలము శ్రీరామ, శ్రీకృష్ణ అవతార విశేషములకు మాత్రమే.   ఇప్పుడు ఈ అవతారపురుషులలోని భగవంతుని లక్షణములను మరియు శ్రీసాయిబాబా యందలి దైవగుణములను పైన చెప్పబడిన లక్షణ క్రమంలోపోల్చి చూచెదము. ప్రధమ భగవద్  లక్షణము కీర్తి.  కీర్తియనగా యశస్సు, గొప్పదనం. పైనుదహరింపబడిన అవతారపురుషుల గొప్పతనము ఐదువేల సంవత్సరముల కు పైబడే భారతీయులకు విదితమే. శ్రీరాముని పేరుగాని ,  శ్రీకృష్ణుని పేరుగాని వినని భారతదేశపు  వారుండరు. వారిఖ్యాతి ఊరూరా, వాడవాడ వ్యాపించినది. అన్నిప్రా...

మనం జ్యోతి స్వరూపులం

Image
శ్రీసాయినాథాయనమః  యోగులు, మహర్షులు జీవితాన్నొక నాటకరంగంగా పోల్చుతారు. విశ్వవిఖ్యాత షేక్స్పియర్ మహాశయుడు జీవితాన్ని ఓనాటకరంగస్థలంగాను  మనుషులందరూ నటులుగాను వర్ణించారు. ఇదేవిషయాన్ని వేరొకరూపంగా చెప్పాలంటే     సినిమా హాలులో జరుగు దృశ్యమునొకసారి పరిశీలించెదము. ప్రొజెక్షన్ బూత్ నుండి వెలువడిన  వెలుగు కిరణాలు తెరనుతాకి చిత్రవిచిత్రములైన రూపములను నామములను దాల్చి సినిమాకథను నడిపిస్తాయి. ప్రేక్షకులు తమ సినిమావీక్షణంలో కథతో మమేకమై తదనుగుణ భావోద్రేకాలకు లోనగుట అందరెరిగిన సత్యమేకదా! సినిమాతో  లీనమైన ప్రేక్షకులకు ఆ బొమ్మలమూలమైన వెలుగురేఖల ఉనికే పట్టదు. ఈవిషయాన్ని ఉదాహరణగా చెప్పుచూ  గొప్ప సత్యద్రష్టలు సృష్టి విధానాన్ని తమ అనుభవపూర్వకంగా విశదపరిచారు. నామరూపులులేని పరంజ్యోతి పరమాత్మ,  తానే అనేక రూపములను, నామములను ధరించి సృష్టి రచించాడు. తానే సృష్టిజీవులందరిలో వెలుగు దివ్వెగా ఎరుక రూపంలో ప్రకాశిస్తున్నాడు. నామరూపములు భిన్నమైనను జీవులందరిలో  ప్రకాశించే ఏకమైన పరంజోతి తానేనని శ్రీషిర్డీసాయి భక్తులకు అనుభవాన్ని ప్రసాదించారు, అందరిలో తననే చూడమని ప్...