సుందర శిల్పం - సాయి సంకల్పం!
శ్రీసాయినాథాయనమః
సుందర శిల్పం - సాయి సంకల్పం!
శిరిడీలోని సమాధిమందిరంలో, బాబాసమాధి వెనుకప్రక్కగా ప్రతిష్ఠింపబడిన సాయి సుందర విగ్రహమునుజూసి తన్మయులుగాని వారుండరు. సజీవరూపంగా పరిపూర్ణచైతన్య వంతమైన బాబాను చూచునట్టి యనుభూతి భక్తులకు కలుగుతుంది. అందరి అంతరాత్మల యలరు చైతన్యతరంగమే శ్రీ సాయిబాబా. భక్తుల అంతరంగముల చైతన్యపరచి ప్రేరణగూర్చి , తమ సంకల్పముల నెరవేర్చుకొనెడి కుశలకర్ములు శ్రీసాయినాథులు. బాబాసుందర మూర్తి నిర్మాణంలో వారి సంకల్పప్రభావమెలా పనిచేసిందో ఇచట పరిశీలించెదము.ఓరోజు బొంబాయి నౌకాశ్రమములోనికి ఇటలీ దేశం నుండి పెద్దచలువఱాయి శిల వచ్చినది. ఆలాపడియున్న శిలను ఎవరూ గ్రహింపకుండుట జూసి , నౌకాశ్రమ యజమాన్యం వేలం వేస్తే, ఓవ్యక్తికొని షిర్డీ సంస్థానమువారికి సమర్పిస్తాడు. సంస్థానమువారు ఆశిలను బహువిలువైనదిగా నెఱింగి, ఆ శిలనుపయోగించి బాబా మూర్తిని చేయించాలని తలచారు. ఇందులకై వారు బొంబాయికి చెందిన సుప్రసిద్ధ శిల్పి బాలాజీ వసంత తాలిం ను సంప్రదించి వానికీపవిత్రకార్యము నప్పగించారు. శిల్పి సాధారణముగా ఓ నమూనా శిల్పాన్నిచెక్కి, దాని ఆధారంగా అసలు శిల్పాన్ని తయారుజేస్తారు. శిల్పి తాలిం వద్ద బాబారూపానికి సంబంధించిన ఎలాంటి చిత్రపటముగాని, శిల్పముగాని లేకుండుటచే నమూనా శిల్పం చెక్కడం పెద్ద సమస్యగా మారింది. బహుసుందర బాబామూర్తిని చెక్కుటకు సహాయం కోరుచూ సాయిని తీవ్రంగా ప్రార్ధించాడు తాలిం.
శ్రీసాయిని సజీవులుగా చూడలేదేయను వ్యాకులత యేల? శిరిడీ సమాధిమందిరమున నిలువెత్తువారి సుందరవిగ్రహమును దర్శించి వారిని ప్రత్యక్షముగా చుసిన అనుభూతిని పొందగలము!
ReplyDelete