సాయి కథలు - యోగీశ్వరుల ఏకాత్మభావన !

ఓంశ్రీసాయినాథాయనమః

సాయి కథలు - యోగీశ్వరుల ఏకాత్మభావన ! 
నేడు గురుపౌర్ణమి 
112 సంవత్సరములకు పూర్వము, అనగా 1917వ సంవత్సరమున గురుపౌర్ణమి రోజున ఠాణా  జిల్లా  దహను గ్రామానికి చెందిన భక్తుడు హరిభావ్ కర్ణిక్  బాబాను తగువిధమున పూజించి వస్త్రముల, దక్షిణల సమర్పించాడు. శ్యామా ద్వారా బాబా సెలవుపొంది మసీదునుండి బయలుదేరాడు. కొంతదూరం వెళ్ళినపిమ్మట బాబాకు మరొక్క రూపాయి దక్షిణనివ్వాలనే భావంతో వెనుదిరిగాడు. అలా సెలవుపొందినపిమ్మట  తిరిగిరావడం శిరిడీ సాంప్రదాయానికి వ్యతిరేకమని యచటి వారుచెప్పుటచే కర్ణిక్ తనప్రయాణం కొనసాగించాడు. మార్గమధ్యంలో నాసిక్ లోని కాలారాముని దర్శించుకొని మందిరమునుండి వెలుపలికి వచ్చునపుడు యచటనే వేంచేసియున్న నరసింగ మహరాజ్ యను యోగిపుంగవులు తమభక్తులవిడచి హరిభావ్ చేతిని పట్టుకొని తమరూపాయి తమకివ్వవలెనని పట్టుపట్టారు. మిగుల ఆశ్చర్య ఆనందాలకు లోనయిన  కర్ణిక్  తాను సాయికివ్వదలచిన దక్షిణరూపాయిని నరసింగ్ మహారాజుకు సమర్పించాడు. యోగీశ్వరుల అంతరంగములు  ఒకేస్థాయిలో  వ్యాపించియుంటాయి, ఒకరిభావాల మరొకరు యతిసులువుగా గ్రహింపగలరను సత్యము నిచట నిరూపింపబడినది.  యోగీశ్వరులకు జేసిన పూజ సాయిపూజ, వారికి సమర్పించిన దక్షిణ సాయికి దక్షిణ!

మిగిలియున్న గదాధరుని ( శ్రీ రామకృష్ణ పరమహంస ) అవతారకార్యాన్ని తాముస్వీకరించి మరల జీవితులైనామని, 72 గంటల సమాధియనంతరము ( 1886వ సంవత్సరములో ) సాయిబాబా భక్తులకు చెప్పియున్నారు. అదేరోజున శ్రీ రామకృష్ణ పరమహంస పరమపదించిన విషయం గమనింపవలెను. 

శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి! 

శ్రీనరసింగ్ మహరాజ్

Comments

  1. సాధు సత్పురుషులసేవ సాయికి ప్రియము! వారి యంతరంగములన్నియు ఒకే తలంపై యుంటాయి, భక్తులకు శ్రేయస్సు గూర్చుతాయి!

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

విష్ణుమాయ.

శ్రీసాయిసందేశామృతము(Nectar of Sri Sai's message.)