సాయి కథలు - 'ఇంకను నన్ను నమ్మవా! '

శ్రీసాయినాథాయనమః 

సాయి కథలు -   'ఇంకను నన్ను నమ్మవా!' 

నేడు గురుపౌర్ణమి 

నాసిక్ జిల్లా, మాలేగాం లో నివేసించే వైద్యుడు. వానిమేనల్లుడు  నయంకాని రాచకురుపుచే బాధపడుచున్నాడు. డాక్టరుతో పాటు ఇతర డాక్టర్లుకూడా నయంచేయలేకపోయారు. తుదకు పిల్లవాని తలిదండ్రులు బాబాను శరణువేడారు. బాబా కృపచే మేనల్లుడు రోగముక్తుడైనాడు. ఈవిషయం తెలిసిన డాక్టరు మిగుల ఆశ్చర్యపడ్డాడు. మాలేగాం నుండి శిరిడీ మీదుగా  బొంబాయి వెళ్ళుమార్గమధ్యలో సాయిబాబాను దర్శింప దలచాడు  డాక్టరు. కాని మాలేగాం, మన్మాడులలో బాబానుగూర్చి కొందరు వ్యతిరేకంగా చెప్పుటచే తనమనసు మార్చుకున్న డాక్టరు నేరుగా బొంబాయి వెళ్ళాడు.

తానున్న బొంబాయిలో వరుసగా మూడురాత్రులు " ఇంకను నను నమ్మవా " యనుమాటలు వినిపించుటచే మరల మనసుమార్చుకొని శిరిడీ వెళ్ళ సంకల్పించాడు.  

తనమనసులో సాయిని పరీక్షింపదలచి, తానుఁజూచుచున్న రోగి అదేరోజున బాగయిన మరుసటి దినమే శిరిడీ వెళ్ళ దలచాడు . ఆశ్చర్యకరంగా రోగి బాగాగుటచే డాక్టరు అనుకొన్నవిధంగా బాబాను దర్శించి మిగులభక్తిశ్రద్ధల నమస్కరించి   ఆసీసులు పొందాడు. తనకు చక్కటి అనుభవములు కలుగుటచే  మంచి  భక్తుడైనాడు. నాలుగురోజులు శిరిడీలో గడిపి ఊది ప్రసాదములు, బాబా ఆశీసులతో ఇంటికి జేరాడు. పక్షం రోజుల్లో హెచ్చుజీతంపై బీజాపూరుకు బదిలీ యైనాడు. మేనల్లుని రోగమావిధంగా బాబా దర్శనానికి తోడ్పడినది.  తమకు గలిగిన అనుభవములను ఆసరాగా గ్రహించి సాయిపట్ల నమ్మకము పెంపొందించుకొనుట భక్తులకెంతో మేలుగదా!

శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి! 






Comments

  1. సాధారణ వ్యక్తులలో భక్తివిశ్వాస బీజములనాటి తమభక్తులుగా మార్చుట సాయిలీల !

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

విష్ణుమాయ.

శ్రీసాయిసందేశామృతము(Nectar of Sri Sai's message.)