సాయి కథలు - శిరిడీ ఆరతులు
శ్రీసాయినాథాయనమః సాయి కథలు - శిరిడీ ఆరతులు శ్రీసాయి విశ్వంలోని చరాచర జీవులందరిలో విలసిల్లు చైతన్య దీప్తులు. వ్యక్తుల అంతరంగాల చైతన్య పరచి తమ కార్యముల నెరవేర్చుకొనెడి కుశల కర్ములు సమర్ధ సాయినాథులు. ఈ సత్యాన్ని సమాధిమందిర నిర్మాణంలోను, తమ సమాధికెదురుగా నిలువెత్తు సమ్మోహన, సజీవ శిల్పస్థాపనలోను, సాయి మందిరాల్లో నిత్యం పాడుకొనే ఆరతుల రచనలలోనూ మనం చూడగలం. అరతుల వెనుక సాయి ప్రేరణ యెలాంటిదో ఇపుడు పరిశీలిద్దాం. " నాగపూర్ జిల్లాకు చెందిన భీష్మకు 1908 లో ఒకరాత్రి కలలో ఒక నల్లని సద్బ్రాహ్మణుడు దర్శనమిచ్చి ఒక కాగితం మీద " సచ్చిదానంద " అన్న మంత్రం చూపాడు. తర్వాత అతడొక సాధువును అడిగితే అది అతని సద్గురుని నామమని చెప్పాడు. తర్వాత అతడు శిరిడీ వచ్చినపుడు సాయి అతనిని చూస్తూనే నవ్వి " జై సచ్చిదానంద " అన్నారు. అతనాశ్చర్యపోయి తనకు స్వప్న దర్శన మిచ్చిన గురువు వీరేమోననుకొన్నాడుగాని , వారు వైష్ణవులు, సాయి ముస్లిం గదాయని శంకించాడు. ఒకరోజు సాయి , " మేము సర్వత్రా సంచరించుచున్నాము బొంబాయి, పూణే , నాగపూర్ మొదలగు ప్రదేశాలన్నీ రామ మయమే. తెలిసిందా మిత్రమా? నీవు ఐద...