Posts

Showing posts from February, 2020

శ్రీరామకృష్ణ పరమహంస జయంతి.

Image
శ్రీసాయినాథాయనమః, శ్రీరామకృష్ణాయనమః ! 1836 - 1886 నేడు శ్రీరామకృష్ణ పరమహంస 185వ  పవిత్ర జయంతి. " మహాత్ముల కథలు వినుటయనగా వారి సాంగత్యము  చేయుటే " శ్రీ సాయి సచ్చరిత్రము శ్రీరామకృష్ణ పరమహంస మహాద్భుత  జన్మ వృత్తాంతము.  అవతారపురుషుల జన్మము అద్భుతము, వారి కర్మలు అద్భుతము, వారి జీవనసరళి అత్యత్భుతము. ఈసత్యమును  శ్రీకృష్ణుని, గౌతమబుద్ధుని, ఆదిశంకరాచార్య,  చైతన్య మహాప్రభు, శిరిడీ సాయిబాబా, రామకృష్ణ పరమహంస  మున్నగు మహాపురుషుల జీవితములు పరిశీలించిన చూడగలము. గదాధరుని ( శ్రీరామకృష్ణ పరమహంస) శేషఅవతారకార్యమును కొనసాగించుటకుగాను తాము మరల ప్రాణముపొందితిమని 1886వ సంవత్సరములో మూడురోజుల సమాధియనంతరము సాయిబాబా భక్తులకు చెప్పియున్నారు. అనగా వీరిరువురి అవతారకార్యములు  ముడివడియున్నటుల గ్రహింపవచ్చును.   ఈమహనీయులిద్దరు యితర అవతారపురుషులవలె కారణజన్ములు, కేవలము లోకకళ్యాణమునకై మానుషవేషధారులై ప్రభవించారు. ప్రస్తుతవ్యాసంలో శ్రీరామకృష్ణుల జన్మవృత్తాంతమును క్లుప్తంగా పరిశీలించెదము.  శ్రీరామకృష్ణ పరమహంస బాల్యనామము గదాధరుడు. ఆతని తండ్రిపేరు క్షుద...

కాశీలో విశ్వనాథుడు మోక్షమిస్తున్నాడా?

Image
 ఓంనమశ్శివాయనమః  పాఠక భక్తమహాశయులెల్లరకు మహాశివరాత్రి శుభాకాంక్షలు! " మహాత్ముల కథలు వినుటయనగా వారి సాంగత్యము  చేయుటే " శ్రీ సాయి సచ్చరిత్రము శ్రీరామకృష్ణ పరమహంసకు వారణాసిలో విశ్వనాథుని దివ్యానుభవము! మనశాస్త్ర,  పురాణములలో  చెప్పబడిన అనేక  నిగూఢ సత్యములను శ్రీరామకృష్ణ పరమమహంస తమ అనుభవపూర్వకంగా తెలిసికొని, ఆయా విషయములెల్లను నూటికి నూరుపాళ్లు నిజమని లోకానికి తెలియ జెప్పారు.   వారణాసి పవిత్రపుణ్యక్షేత్రం, శివరాత్రిమహాపర్వదిన  శుభసందర్భముగా కాశీవిశ్వేశ్వరుని మహిమను తెలుపు శ్రీరామకృష్ణ పరమహంస దివ్యానుభవమును తెలుసుకొందాము.  కాశీలో మరణించినవారికి మోక్షం లభిస్తుందనేమాట నిజామా?  శ్రీరామకృష్ణుల అద్వైతానుభవము పొంది,  తమ సాధనాక్రమం పూర్తయ్యాక వివిధ పుణ్యక్షేత్రాలు దర్శించి పెక్కు దివ్యానుభూతుల పొందారు.  పరమహంస తమ వారణాసి దివ్యానుభవాన్ని మాథుర్ మరియు ఇతర భక్తులకిలా వివరించారు. " వారణాసి మణికర్ణికా ఘాట్లో నేనొక తెల్లటి పొడగాటి దివ్యమూర్తిని చూసాను ( ఆసమయంలో శ్రీరామకృష్ణ గంగానదిలో ఓపడవపై కూర్చొని వరుస ఘాట్లన...

సాయి కథలు - గురుస్పర్శ ప్రభావము 4

Image
శ్రీసాయినాథాయనమః  సాయి కథలు - గురుస్పర్శ ప్రభావము 4 " మహాత్ముల కథలు వినుటయనగా వారి సాంగత్యము  చేయుటే " శ్రీ సాయి సచ్చరిత్రము ఇంతకుముందు గురుస్పర్శ మహిమను గురించి, శక్తిని గురించి  వివరించుకొన్నాము ( https://saishakthitelugu.blogspot.com , dated  11/28/19, 12/5/19, 01/01/20)  ఇచట ఒక ప్రశ్న ఉదయిస్తుంది, అదేమన ' ప్రస్తుతం సాయిబాబా సశరీరులుగా లేరుగదా, మరివారి స్పర్శానుభవమునెలాపొందాలి?  ' యనెడిది. ఇందులకు సమాధానమును బాబాయే సూచించారు, తమగురుప్రసాదమైన ఇటుకను తమ తలగడగా నిత్యం ఉపయోగించారు. అదేవిధంగా మనం శిరిడీ సందర్శించినప్పుడు వారు సశరీరులుగా యున్నప్పుడు స్పృశించిన, ఉపయోగించిన, దినచర్య కొనసాగించిన యిత్యాది పెక్కు వస్తువులను చూడగలము. సాయిశక్తిచే అవన్నియు పునీతములై మహాశక్తి సంతరించుకొన్నవి. ఈవివరములను మరింత విశ్లేషించుకొందాము. సాయిబాబా మొట్టమొదట ఖండోబా గుడివద్ద పెండ్లివారి బండినుండి దిగి తమ పాదస్పర్శచే ఆస్థలాన్ని పవిత్రం జేశారు. ఆపై గురుస్థానము, వేపచెట్టు, తాకియా మున్నగుప్రదేశముల నివసించినపిమ్మట ద్వారకామాయిగా ప్రసిద్ధికెక్కిన పాతమజీదున రమారమి  60 సంవత్సర...

సద్గురువు !

Image
శ్రీసాయినాథాయనమః  సద్గురువు !  " మహాత్ముల కథలు వినుటయనగా వారి సాంగత్యము  చేయుటే " శ్రీ సాయి సచ్చరిత్రము సాయిబాబా సద్గురువు. సమస్తవిశ్వం తామేయని భక్తులకు యనుభవమివ్వగల సమర్థులే సద్గురువు. కురుక్షేత్ర యుద్ధసమయాన శ్రీకృష్ణపరమాత్మ తనభక్తుడైన అర్జునునకు గీతబోధచేస్తూ, బోధయేచాలక తమబోధలో ప్రకటించినటుల తాము విశ్వరూపులమని రుజువుచేయుటకై  పార్థునకు దివ్యదృష్టి ప్రసాదించి,  తమ విశ్వరూపాన్ని చూపారు. బోధతోపాటు యనుభవమును ప్రసాదించారు  శ్రీకృష్ణపరమాత్మ. ప్రస్తుతకాలంలో బోధగురువులకు అంతేలేదు, వారుబోధింపగలరుగాని దానికి తగిన యనుభవమును వారుపొందియుండరు, పొందినా భక్తులకు అట్టి యనుభవమును ప్రసాదింపలేరు. సాయిబాబా విషయంచూస్తే ఇందులకు భిన్నంగా యుంటుంది. తాము సర్వదేవస్వరూపులుగా, సర్వయోగిస్వరూపులుగా, సర్వజీవస్వరూపులుగా సర్వ చరాచర విశ్వచైతన్య స్వరూపులుగా భక్తులకు బోధించడమేగాక యట్టియనుభవమును వారికి సమకూర్చారు. ఇది పరమసత్యం. మరొక్కముఖ్యవిషయమేమంటే తాము జీవించియున్నకాలమునందేగాక, వారిసమాధియనంతరము సయితము వారిట్టి యనుభవమును భక్తులకు సమకూర్చుచున్నారు. ఇలాంటిసంఘటన నొకదానిని స్మరించుకొందాము. ...

సాయిబాబా ఫోటో !

Image
శ్రీసాయినాథాయనమః    సాయిబాబా  ఫోటో !  " మహాత్ముల కథలు వినుటయనగా వారి సాంగత్యము  చేయుటే " శ్రీ సాయి సచ్చరిత్రము సాయిబాబా  తమకు తమచిత్రానికి తేడాలేదని యెన్నో సార్లు చెప్పారు. పూజానంతరం బాబాఫోటోనుండి విభూతి, తేనె, కుంకుమ   రాలడం ఎందరో భక్తుల యనుభవము. ఇది రచయిత స్వానుభవంకూడాను.  ఈవిషయమై శ్రీ సాయిసచ్చరిత్రములో చెప్పబడిన యొకరి అనుభవాన్ని చూద్దాము. బాలబువా సుతారు ప్రముఖ సంకీర్తనకారుడు.  బొంబాయిలో నివసించే యితడు ఓపర్యాయము సాయి దర్శనానికై శిరిడీ వచ్చాడు. గొప్పభక్తుడు, ఎల్లవేళలా భగవన్నామము జేసెడి వాడు కావున జనులాతని ' నవయుగ తుకారాం ' అని పిలిచేవారు. సుతారు బాబాకు  నమస్కరించగానే  సాయి " నేనీతనిని నాలుగుసంవత్సరములనుండి ఎరుగుదు " ననిరి. మొదటిసారిగా శిరిడీ వచ్చిన ఈతనికీవిషయం బోధపడలేదు. కాని తీవ్రంగా ఆలోచించినపిమ్మట బొంబాయిలో 4 సంవత్సరముల క్రిందట బాబా ఫొటోకు నమస్కరించినటుల జ్ఞప్తికి వచ్చెను. మరొకరి అనుభవం. అప్పాసాహెబు కులకర్ణి ఠాణాకు బదిలీపై వచ్చెను. బాలాసాహెబు భాటే యిచ్చిన  సాయిబాబా ఫోటోను నిత్యంపూజిస్తూ బాబాను చూడవలెనని మిగ...

శ్రీవిష్ణుసహస్రనామం.

Image
శ్రీసాయినాథాయనమః  భగవతేశ్రీవాసుదేవాయనమః  శ్రీవిష్ణుసహస్రనామం " మహాత్ముల కథలు వినుటయనగా వారి సాంగత్యము  చేయుటే "  ఈరోజు పవిత్ర భీష్మఏకాదశి, షుమారు ఐదువేల సంవత్సరాలపూర్వము శ్రీవిష్ణుసహస్రనామము లోకానికందిన శుభదినము. శ్రీవేదవ్యాస మహర్షి శ్రీమద్మమహాభారతం రచించారు. మహాభారతానికి రెండింటివలన గౌరవమని విజ్ఞుల అభిప్రాయము. మొదటిది శ్రీకృష్ణపరమాత్మ బోధించిన శ్రీమద్భగవద్గీత, రెండవది శ్రీభీష్మాచార్యులు లోకానికందించిన శ్రీవిష్ణుసహస్ర నామ స్తోత్రము. కురుక్షేత్రయుద్ధం ముగిశాక అంపశయ్యపై పరుండిన భీష్మాచార్యులు తమకెదురుగా నిలబడియున్న పాండవులకుపదేశించారు, వారివెనుక శ్రీకృష్ణపరమాత్మ యున్నారు. ధర్మరాజడిగిన ప్రశ్నలకు సమాధానంగా భీష్మాచార్యులు ఈస్తోత్రపరంగా శ్రీవిష్ణుమూర్తియొక్క కళ్యాణగుణాలను వివరించారు. ఈస్తోత్రాన్ని భక్తిశ్రద్ధల వినువారలకు, పఠించువారలకు  అనేక శుభములుకలుగుననెడిది  పెక్కుభక్తుల యనుభవము. సాక్షాత్తు సద్గురు శ్రీసాయినాథులు తమ ప్రియభక్తుడు శ్యామాకు ఈగ్రంధ మహిమనిలా వివరించారు. " ఓ శ్యామా! ఈగ్రంధము మిగుల విలువైనది. ఫలప్రదమైనది.  కనుక నీకిది బహూకరించుచున్నాన...

భక్తునిజేరుటకు విమానమవసరంలేదు!

Image
శ్రీసాయినాథాయనమః  " భక్తునిజేరుటకు విమానమవసరంలేదు! " ,  సాయిబాబా " మహాత్ముల కథలు వినుటయనగా వారి సాంగత్యము  చేయుటే " శ్రీ సాయి సచ్చరిత్రము సాయి సర్వాంతర్యామి, అంటే అందరిహృదయాలలో నివసించే దివ్యశక్తి మయుడు. ఈవిషయమై శ్రీసాయిసచ్చరిత్రములో పెక్కు ఉదాహరణలున్నవి, ప్రస్తుత భక్తుల యనుభవంకూడాను. బాబాలీలలు దేశదేశాలు, ఖండఖండాలు వ్యాపించినవనుట నిత్యసత్యము.  బాబాభక్తుడు బీ.వీ.దేవ్ తమయింట జరుగు ఉద్యాపన శుభకార్యానికి దయచేసి తప్పకరావలసినదని బాబాకు ఆహ్వానలేఖ పంపగా, దగ్గరున్న జోగు ఉత్తరం చదివి బాబాకు వినిపించాడు. ఆవిషయం విన్నపిమ్మట  బాబా యిట్లన్నారు, " నన్నేగుర్తుంచుకొనువానిని నేను మరువను. నాకుబండిగాని, టాంగాగాని, రైలుగాని, విమానముగాని యవసరములేదు. నన్నుప్రేమతో పిలుచువారియొద్దకు నేను పరుగెత్తిపోయి ప్రత్యక్షమయ్యెదను.  నీవు, నేను, మరియొకనితో సంతర్పణమునకు వచ్చెదమని  వానికి సంతోషము కలుగునట్లు వ్రాయుము."  బాబాచెప్పినట్లు జోగు  దేవుకు లేఖవ్రాసెను. సంతర్పణము జరుగు రోజున, సరిగ్గాసమయానికి  బాబా సన్యాసివేషమున మరిద్దరితోకలిసి దేవునింట భోంచేసి వెళ్లగా, దేవు...