Posts

Showing posts from March, 2020

వేప చేదు!

Image
శ్రీసాయినాథాయనమః  శ్రీసాయిభక్త పాఠక పరివారానికి శార్వరి నామనూతన సంవత్సర (ఉగాది ) శుభాకాంక్షలు !   " సదానింబవృక్షస్య మూలాధివాసాత్    సుధాశ్రావిణం తిక్తమప్య ప్రియంతం       తరుమ్ కల్పవృక్షాదికం సాధయంతం           నమామీశ్వరం సద్గురుం సాయినాథం ! " ( " సదా చేదురసమును స్రవించు వేపచెట్టుమూలంలో నివసించి దానిని కల్పవృక్షముకంటే అధికమైన దానినిగా చేసిన ఈశ్వరరూప సద్గురునకు నమస్కరించుచున్నాను."   సద్గురు సాయినాథులు సమస్త మానవాళిని  కరోనా మహమ్మారి విషప్రభావంనుండి  రక్షించి , అందరిజీవనం మధురమయం జేయుగాక!  ) సాయి కథలు -  వేప చేదు. " మహాత్ముల కథలు వినుటయనగా వారి సాంగత్యము  చేయుటే " శ్రీ సాయి సచ్చరిత్రము సాయిబాబా శిరిడీ వచ్చిన మొదటిరోజుల్లో వేపచెట్టుక్రింద కూర్చుని తపస్సుచేసేవారు. అదేవేపచెట్టుకింద సెల్లార్ వారిగురుస్థానమని బాబానే వివరించారు. సాయి తపోశక్తిచే వారు కూర్చున్నభాగంవైపు చెట్టుకొమ్మ ఆకులు చేదురుచి కోల్పోయి చప్పగామారినవట.  రెండవపక్కనున్న వేపాకులు సహజరుచి...

గురుచరణాలు !

Image
శ్రీసాయినాథాయనమః సాయి కథలు - గురుచరణాలు ! " మహాత్ముల కథలు వినుటయనగా వారి సాంగత్యము  చేయుటే " శ్రీ సాయి సచ్చరిత్రము ( ప్రస్తుతము కొవిడ్ మహమ్మారి ప్రబలిన  ప్రపంచవిపత్కర పరిస్థితిలో పెక్కుమంది తమ యిండ్లకే పరిమితమయ్యారు. కొంతవిరామసమయం లభిస్తుందిగావున శ్రీసాయిచరిత్ర, విష్ణుసహస్రనామము, భగవద్గీత లాంటి పవిత్రగ్రంధాలుచదివి మనకాలాన్ని సద్వినియోగపరచెదముగాక! ) " విశ్వాన్ని గురువు ధరిస్తాడు, ఆగురుని వారి చరణాలు భరిస్తాయి " ఇది శాస్త్రవాక్యం.  గురుపాదసేవ  భక్తులకెంతో శ్రేయస్కరము. శిరిడీలో యెందరో భక్తులకిది యనుభవ విషయం. సాయి పాదములనుండి గంగాయమునలు వెల్లుబికిన లీల శ్రీసాయి సచ్చరిత్రములో వివరింపబడినది. ప్రయాగ వెళ్లదలచిన భక్త దాసగణుకు సాయి తమ పాదములందే పవిత్ర గంగయమునల ప్రవహింపజేశారు. పరవసించిన దాసగణు సాయిని స్తుతించాడు. ఎందరో భక్తులు శిరిడీలో, సాయిసమాధి దర్శనముచే పరమశాంతిని పొందారు.   ఇచట బాబాచూపిన మరొక చమత్కారం చూచెదము. ఒకప్పుడు కొందరు భక్తులు బాబాను ఫొటోతీయుటకు యనుమతి కోరారు. బాబా మొదట అంగీకరింపలేదు, చివరకు పదేపదే ప్రాధేయపడితే యనుమతిచ్చారు. ఫో...

తల్లిదండ్రుల భక్తిశ్రద్ధలు, బిడ్డలకు శక్తిముద్రలు!

Image
శ్రీసాయినాథాయనమః  సాయి కథలు -  తల్లిదండ్రుల భక్తిశ్రద్ధలు, బిడ్డలకు శక్తిముద్రలు! " మహాత్ముల కథలు వినుటయనగా వారి సాంగత్యము  చేయుటే " శ్రీ సాయి సచ్చరిత్రము భగవంతరావు  క్షీరసాగర్  పాండురంగ విఠలుని  మిగుల పూజించెడివాడు. వాని మరణానంతరము కొడుకు ఇంట్లోని దేవతావిగ్రహాలకు పూజజేయడం మానేసాడు, నైవేద్యం కూడా పెట్టడం లేదు. అతడు మొదట శిరిడీ రాగానే సాయి, " ఇతని తండ్రి నాకాప్తుడు. నాకు నివేదించక తినేవాడుగాదు. ఆయన చనిపోయాక యితడు నైవేద్యమివ్వక నన్నూ, విఠలుణ్ణి పస్తుంచాడు. ఇతనికి హితం చెప్పడానికే రప్పించాను ". అన్నారు. క్షీరసాగరుని భక్తిశ్రద్ధలు, వానిపుత్రుని బాబా పిలుపుకు, కరుణాకటాక్షాలప్రాప్తికి  కారణమయ్యాయి.  చేసిన పుణ్యం చెడని పదార్ధం! పెద్దలు జేసిన  పుణ్యము బిడ్డలకు తప్పకప్రాప్తిస్తుందనేది, వారిని రక్షిస్తుందనేది  అక్షరసత్యం కదా! తల్లిదండ్రులు, పూర్వీకులు చేసిన కష్టఫలం, పుణ్యఫలం మనప్రస్తుతస్థితికి మూలము. వారిపట్ల సదాకృతజ్ఞతగలిగియుండటం మన కనీసధర్మం కదా!  అందులకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ యని పెద్దలు వచించారు...

మహమ్మారినుండి రక్షణ !

Image
శ్రీసాయినాథాయనమః  సాయి కథలు - మహమ్మారినుండి రక్షణ!  " మహాత్ముల కథలు వినుటయనగా వారి సాంగత్యము చేయుటయే ! శ్రీ సాయి సచ్చరిత్రము  ప్రస్తుతకాలంలో కరోనా వైరస్ (కొవిడ్ -19 ) మహమ్మారి ప్రపంచదేశాలన్నింటిని వణికిస్తుంది. ఎంతో ప్రాణనష్టం, ధననష్టం జరుగుతుంది. నివారణకై ఎందరో శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, వైద్యులు యుద్ధప్రాతిపదికపై రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. త్వరలోనే ఈ భయానక వైరస్ కు వాక్సిన్ లభించగలదని ఆశిస్తూ, సర్వమానవాళి  రక్షణకై శ్రీ సమర్ధ సద్గురు సాయినాథుని హృదయపూర్వకంగా ప్రార్ధిస్తున్నాను.  ఎందుకనగా సాయిబాబా జీవితకాలంలోకూడా  కలరా, మశూచి, ప్లేగు వంటి భయంకర మహమ్మారీ వ్యాధులు లక్షల ప్రజల ప్రాణముల హరించినవి. ఆ విపత్తర కాలంలోనూ యెందరో భక్తులు సాయినాథుల ఆశీసులతో తమ ప్రాణముల రక్షించుకొన్నారు. ఈవివరములను శ్రీ సాయి జీవితచరిత్రలో  చూడగలము, కొన్నింటి నిచట పరిశీలించెదము. అమరావతి నివాసి దాదాసాహెబ్ ఖాపర్డే భార్య తన చిన్నకొడుకుతో కలిసి శిరిడీలో కొంతకాలముంది. ఓరోజు ఖాపర్డే పుత్రునికి తీవ్రజ్వరమొచ్చి పిదప ప్లేగు జ్వరంకింద మారింది. తల్లిమిక్కిలి భయపడి సాయిబ...

సాయి కథలు - బాధ్యతలు !

Image
శ్రీసాయినాథాయనమః  సాయి కథలు - బాధ్యతలు  " మహాత్ముల కథలు వినుటయనగా వారి సాంగత్యము  చేయుటే " శ్రీ సాయి సచ్చరిత్రము సాయిబాబా తన భక్తులసయితము  తమతమ వ్యక్తిగత బాధ్యతలను విస్మరింపనిచ్చెడివారు కాదు. శ్రీసాయిసచ్చరిత్రములో యిందులకు కొన్నిఉదాహరణలు కలవు. హరిభావూ బాబాకు అంకితభక్తుడు. ఒకసారి జబ్బుపడ్డ  తనతల్లికి చెప్పకుండా రామేశ్వరం బయలుదేరి మార్గంలో శిరీడీ వచ్చాడు. సాయి ఆతనినుండి డబ్బంతా దక్షిణగా తీసుకొని " ఇంటికివెళ్ళు,  రామేశ్వరం నీకోసం పస్తుంది. నీవు వెళ్లకుంటే మరణిస్తుంది" అన్నారు. అతడిల్లు చేరేసరికి అతని తల్లి  ఆహారం మాని, " సాయీ, నీవు మహాత్ముడవైతే  నా కొడుకు తిరిగి రావాలి " అని రోజూ ప్రార్ధిస్తుందని తెలిసింది. తల్లి రామేశ్వరమంత పవిత్రమైనదని, పుత్రుడు తల్లియోగక్షేమములు మరచి తీర్ధయాత్రలు చేయకూడదనెడిది బాబా యుద్దేశ్యం. ఒకసారి భక్తురాలు  శ్రీమతి ప్రధాన్ పాదపూజ జేస్తుండగా , " నీవు వెంటనే యింటికెళ్ళు" అన్నారు బాబా. ఆమె వెళ్లేసరికి పాప గుక్కపెట్టి ఏడుస్తుంది. ఆమె పాపను సముదాయించి మరలా మసీదుకు వెళ్ళింది. " ఇప్పుడు పూజ పూర్తిచేసుకో! " అన్న...

సాయి కథలు - హోళీవిందు.

Image
శ్రీసాయినాథాయనమః  పాఠకమహాశయులెల్లరకు హోళీ శుభాకాంక్షలు!  సాయి కథలు - హోళీవిందు  " మహాత్ముల కథలు వినుటయనగా వారి సాంగత్యము  చేయుటే " శ్రీ సాయి సచ్చరిత్రము ఈ అద్భుతసంఘటన  యిప్పటికి 103 సంవత్సరములక్రిందట అనగా 1917 లో,  హోళీ పండుగనాడు జరిగినది. ఆరోజు  తెల్లవారుజామున  బొంబాయి నగరంలో  హేమాద్రిపంతుకు స్వప్నంలో,  సన్యాసి వేషంలో బాబాకన్పించి  ఆ రోజు వారింటికి భోజనానికి వచ్చెదమని చెప్పారు. నిజముగా బాబా వస్తారనే ఆశతో , బాబాకు కూడా వంటచేయించాడు పంతు. భోజనసమయమైనది. అతిధులందరు భోజనానికి సిద్ధమైనారు. బాబాకొరకై వారిమధ్య నొక పీటనమర్చారు. 12 గంటలైనను ఎవరు రాకపోవుటచే, తలుపులు వేశారు. అన్నశుద్ధియనంతము అందరూ భోంచేయుటకుపక్రమింపబోగా , మేడమెట్లపై చప్పుడు వినిపించింది. హేమాద్రిపంతు వెంటనేపోయి తలుపుతీయగ, ఇద్దరు ముస్లింలు పాతపత్రికలో కట్టిన పటమును విప్పి టేబుల్ పై పెట్టి, యది తమవస్తువుగా స్వీకరింపుమని, భోజనసమయమగుటచే ఆ ఫోటో వివరములు తరువాత వివరించెదమనుచు, చకచకా వెళ్లిపోయారు. హేమాద్రిపంతు కాగితము విప్పి చూచుసరికి అందులో పెద్దదియగు చక్కని  సాయి...

చేదుమాత్ర.

Image
శ్రీసాయినాథాయనమః  సాయి కథలు - చేదుమాత్ర " మహాత్ముల కథలు వినుటయనగా వారి సాంగత్యము  చేయుటే " శ్రీ సాయి సచ్చరిత్రము " బిడ్డకు తీపివస్తువులు కావలయును, కాని తల్లి చేదు మాత్రలిచ్చును. తీపివస్తువులు ఆరోగ్యమును చెరచును. చేదుమాత్ర లారోగ్యమును వృద్ధిచేయును. తల్లి తనబిడ్డయొక్క మేలును కాంషించి బుజ్జగించి చేదుమాత్రలే యిచ్చును. బాబా దయగల తల్లివంటివారు. తనభక్తుల భవిషత్ వర్తమానముల లాభములగూర్చి బాగుగా తెలిసినవారు. "  శ్రీ సాయి సచ్చరిత్రము. పైచెప్పబడిన భావమును ధ్రువపరచు సంఘటనలు శ్రీ సాయి సచ్చరిత్రములో పెక్కుచూడగలము. బాబా ప్రియభక్తుడు దాము అన్నా, మిత్రుని సలహాపై ప్రత్తి, ధాన్యముల వ్యాపారముజేసి మిగుల లాభముపొంద యోచించెను. కాని వాని భవిష్యత్తు తెలిసిన బాబా అందులకు నిరాకరించుటచే దాము వ్యాపారము చేయకుండెను. పెట్టుబడిపెట్టి వ్యాపారముజేసిన వానిమిత్రుడు కొంతకాలము పిమ్మట  విపరీతముగా నష్టపోయెను. దాము అన్నా రక్షింపబడెను. క్షయవ్యాధి పీడితుడు భీమాజీ పాటిలును బాబా  అంత సదుపాయముకాని భీమాబాయి యింటిలో బసచేయించెను, వాని ఆరోగ్యమునకది సరిపడునదికాదు. అటులనే మిగులబాధాకరమైన రెండుస్వప్నములను పాట...