సాయి కథలు - తమభక్తుల అవహేళన సహింపని శ్రీహరియే సాయినాథులు!
శ్రీసాయినాథాయనమః సాయి కథలు - తమభక్తుల అవహేళన సహింపని శ్రీహరియే సాయినాథులు! సాయిలీలలను స్మరిస్తుంటే శ్రీకృష్ణుని, శ్రీరాముని, గాథలు కనులముందు గోచరిస్తాయని రచయిత హేమాద్రిపంత్ శ్రీసాయిసచ్చరిత్రములో పేర్కొన్నాడు. నాకుకూడ అలాంటి యనుభవమే అపుడపుడూ కలుగుతుంటుంది. శ్రీసాయిసచ్చరిత్రము 48వ అధ్యాయములోని శేవడే మరియు సపత్నేకర్ కథలు చదువునపుడు ఓ మధురమైన విష్ణులీల మనసుకి తట్టింది. ఆవివరాలను క్లుప్తంగా పరిశీలిద్దాము. ముందుగా సపత్నేకరు గూర్చి తెలిసికొందాము. షోలాపూర్ జిల్లాలోని అక్కల్ కోట నివాసి యతడు, తన లా పరీక్షకు చదువుచుండెను. శేవడే ఆతని సహవిద్యార్థి, సాయిబాబాను మిగులునమ్మినవాడు. తానుబాగుగ చదవకున్నను బాబాకృపతో లాపరీక్షలో తప్పక ఉత్తీర్ణుడ కాగలనని విశ్వసిస్తాడు. బాబాపై యాతని అపార విశ్వాసానికి నవ్వుకొంటాడు సపత్నేకర్. అంతేగాక బాబాను సయితము వెక్కిరిస్తాడు. పరీక్షలో పాసైన సపత్నేకర్ అక్కల్ కోటలో న్యాయవాదవృత్తి ప్రారంభిస్తాడు. పదేళ్ళపిమ్మట దురదృష్ట వశాత్తు తన భార్యను, ఒక్కగానొక్క కొడుకుని కోల్పోతాడు. మిగుల వికలమనస్కుడై పండరీపురము, గాణ్గాపుర పుణ్యక్షేత్రముల దర్శిం...