Posts

Showing posts from September, 2019

సాయి కథలు - నిత్యంజేసే పనులలో సందేహమొస్తే ?

Image
శ్రీసాయినాథాయనమః  సాయి కథలు - నిత్యంజేసే పనులలో సందేహమొస్తే ? " మహాత్ముల కథలు వినుట యనగా వారి సాంగత్యము చేయుటే ! "   శ్రీ సాయి సచ్చరిత్రము  " నీకు కర్మలయందుగాని, ఆచరణమునందుగాని యేదేని సందేహము గలిగినేని, అకాలమునందాదేశమున ధర్మాధర్మ విచారణ సమర్థులును, ఆచార్యులును, నియమనిష్టలు గలవారును, స్వతంత్రులును, క్రూరతలేనివారును, కామహతులుగాని వారును, ధర్మకాములునునగు బ్రహ్మనిష్ఠులగు మహాత్ములు,  ఆయా కర్మ ధర్మాచారమునందెట్లు ప్రవర్తించుచుందురో అట్లే నీవును ప్రవర్తించుము, వారల విచారించి (వారులేనిచో వారి  వారి పవిత్ర జీవిత గ్రంథముల పఠించి, వారివారి సందేశముల పాటిస్తూ)  వారు చేయునట్లు చేయుము. ఇదియే ఆదేశము, ఉపదేశము, వేదోపనిషద్రహస్యము, అనుశాసనము ఈశ్వర శాసనము మరియు ఉపాస్యము." స్తోత్రమంజరి : సద్గురు శ్రీమలయాళ స్వామి  సాయిబాబా, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, స్వామి వివేకానంద, మళయాళస్వామి, ప్రముఖస్వామి, మహాత్మా గాంధీ  లాంటి  మహాత్ములు కాలానుగుణముగా మనమధ్య అవతరించి  సర్వమానవ ఏకత్వమును, సోదరభావమును, ఇతరులపట్ల గౌరవప్రేమాదరణలను,  అన్నిమ...

సాయి కథలు - ఋణానుబంధము

Image
శ్రీసాయినాథాయనమః  సాయి కథలు - ఋణానుబంధము  " మహాత్ముల కథలు వినుట యనగా వారి సాంగత్యము చేయుటే ! "   శ్రీ సాయి సచ్చరిత్రము  సాయి బాబా ఋణానుబంధమును గూర్చి బహు విలువైన వ్యాఖ్యజేశారు. ఏదైన సంబంధము లేనిచో ఒకరినొకరు కలసికొనరు. (అనగా పూర్వకాలంలోగాని, మరింత వెనుకకు వెళితే పూర్వజన్మలోగాని తాను వ్యక్తులతో ఏర్పరచుకొనిన బంధము కొనసాగుతుంది. ఈ బంధము పరిచితులతొ గావచ్చు, ప్రస్తుత అపరిచుతులతొ గావచ్చు  తల్లిదండ్రులతో కావచ్చు, భార్యాబిడ్డలతో గావచ్చు , మిత్రులతో గావచ్చు , శత్రువులతో గావచ్చు  ఇతరత్ర జీవజంతువులతో కావచ్చు, పూజించెడి దైవంతో కావచ్చు సద్గురువుతో గావచ్చు ).  ఈక్రమంలో ఓవ్యక్తి  గతంలో మరొకవ్యక్తికి ఏదైనా ఇచ్చుటగాని లేక పుచ్చుకొనుటగాని జరుగుతుంది, కొన్నివేళల ఎలాంటి లావాదేవీలు జరుగక పోవచ్చును. గతకాలంలో యిలా వ్యక్తులమధ్య పరస్పరమేర్పడిన బంధమే తరువాతి కాలంలో ఋణానుబంధంగా మారి వ్యక్తులను కలుపుతోంది. పూర్వం  ఋణపడిన వ్యక్తి తన బాకీని తీర్చుటకై  ప్రస్తుతం,  గతకాలంలో ఋణమిచ్చినవానిని తప్పక  కలియుట సంభవిస్తుందనేది బాబా సందేశం. ఇంద...

సాయి కథలు - మాయనుగూర్చి మహాత్ముల వ్యాఖ్య !

Image
శ్రీసాయినాథాయనమః  సాయి కథలు - మాయనుగూర్చి మహాత్ముల వ్యాఖ్య ! " మహాత్ముల కథలు వినుట యనగా వారి సాంగత్యము చేయుటే ! "   శ్రీ సాయి సచ్చరిత్రము  క్లుప్తంగా చెప్పాలంటే ఇంద్రియానుభవాలకు  ఉన్నదిలేనటుల , లేనిది ఉన్నటుల గోచరమవడమే మాయని చెప్పవచ్చును. ఈ మాయ విషయాన్నిగూర్చి సాయిబాబా, రామకృష్ణ పరమహంస ఎలా వ్యాఖ్యానించారో చూద్దాం. శ్రీ సాయి సచ్చరిత్రము 13వ అధ్యాయములో సాయిబాబా యిట్లన్నారు, " నేను ఫకీరునయినప్పటికీ, ఇల్లు వాకిలి, భార్యబిడ్డలు , తదితర బాదరబందీ లేవీలేకుండా, ఎక్కడికీ కదలక యొకచోట కూర్చొని యున్నప్పటికీ, తప్పించుకొనలేని మాయ నన్నునూ బాధించుచున్నది. నేను నన్ను మరచినను ఆమెను మరువలేకున్నాను. ఎల్లప్పుడు ఆమె నన్నావరించుచున్నది. హరియొక్క ఆ ఆదిమాయ బ్రహ్మాదులనే చికాకు పరచుచుండగా, నావంటి దుర్బలుడైన ఫకీరనగ నెంత? హరి ప్రసన్నుడైనపుడే ఆమాయనుండి తప్పించుకొనుట సాధ్యం. నిరంతర హరి భజనయే దానికి మార్గం. "   మాయాశక్తిగూర్చి బాబాలాంటి సద్గురువే  ఆవిధంగా పలుకుటచే మాయ  ఎంత శక్తివంతమో ఉహింపగలము. అదే అధ్యాయంలో   మాయాపాశ విమోచనమునకు బాబా మరొక్క చక...

సాయి కథలు - సద్గురు పాదము

Image
శ్రీసాయినాథాయనమః  " సాయి అనంతుడు, నేడు అనంతపద్మనాభ చతుర్థి "  గంగ యముల పవిత్రసంగమం ప్రయాగ. ప్రయాగలో స్నానం చేయడమెంతో పవిత్రమని హిందువుల విశ్వాసం. దాసగణుకూడా ప్రయాగ సంగమ స్నానం చేయదలచి బాబా యనుమతి కోరతాడు. " వ్యయ ప్రయాసలతో అంత దూరమెందుకెళ్లవలె, మన ప్రయాగ ఇచటనేయుందిగదా  నా మాటల నమ్ముము "  బాబా పలికారు. దాసగణు మహారాజ్ బాబా పాదములపై శిరసునుంచగనే బహు ఆశ్చ్యర్యకరమైన వింత జరిగినది. బాబా రెండుపాదముల బొటన వ్రేళ్ళనుండి గంగా యమున జలములు జలజల బారినవి. ఈ సాయిమహిమ జూచి దాసగణు భక్త్యావేశములతో తనదేహం మరచాడు. అతని హృదయంలో కవితావేశం వుప్పొంగి శ్రీసాయిలీలా గానరూపంలో పెళ్లుబికింది.  ఇచట బాబా చూపిన లీల వారి అన్యాపదేశ సందేశమా యన్నట్లు సందేహమొస్తుంది.  సందేశమేమన, "  ఓ జనులారా, మిగుల కష్టపడి అటునిటు తిరిగి యేల  శ్రమపడెదరు, శిరిడీ దర్శనంలోనే అన్నిపుణ్యక్షేత్రదర్శన ఫలమొందగలరు, ఈ ఫకీరులోనే అందరి దేవీ దేవతలను వీక్షింపగలరు! "  భక్తులు తమతమ  భావన కనుగుణంగా బాబాలీల గ్రహింపగలరు!   సాయిబాబా మాటలు నర్భగర్భములు శక్తివంతములు; వారిమాటలు  సమతూ...

సాయి కథలు - సద్గురునితో పరిహాసమా?

Image
శ్రీసాయినాథాయనమః  సాయి కథలు - సద్గురునితో పరిహాసమా?  ఓపర్యాయము సాయిబాబాకు భక్తుడొకరు దక్షిణగా రెండురూపాయలు మని ఆర్డర్ ద్వారా పంపాడు. ఆడబ్బు నందుకొన్న శ్యామా (బాబాకు అత్యంత సన్నిహిత ప్రియ భక్తుడు ) బాబాకివ్వకుండా దగ్గరలో దాచిపెట్టాడు. ఇదిజరిగిన ఆరుమాసములకు శ్యామా ఇంట్లో దొంగలు పడి ( 250 రూపాయల విలువుగల ) యాతనిసర్వస్వమూ  దోచుకుపోతారు. పాలీసులద్వారా కూడ ఆడబ్బు ఆచూకీతెలియకపోవుటచే శ్యామా మిగుల దిగులుతో బాబావద్దకెళ్లి తన డబ్బంతా దొంగలు దోచుకున్నారు, సాయముజేయవలసినదిగా  ప్రాధేయపడతాడు. అపుడు శ్యామాతో బాబా " అరే శ్యామా!  నీడబ్బుపోతే చెప్పుకోవడానికి నేనైనా ఉన్నాను, కాని ఆరుమాసాలక్రిందట పోయిన ఈ ఫకీరు రెండురూపాయలగూర్చి ఎవరికి చెప్పుకోను ? " యనగా తనతప్పు గ్రహించిన శ్యామా నిరుత్తురడవుతాడు. చూసాముకదా మరి సద్గురునిపట్ల  అపచారమూ, పరిహాసమువలన శ్యామా ఎంత నష్టపోయాడో! సాయి అనుగ్రహిస్తే రూపాయకు వందరూపాయలనిస్తాడు కాని ఆగ్రహిస్తే వందరూపాయల వసూలుజేస్తాడు. కావున ఈవిషయమున భక్తులెంతో  జాగరూకులై వ్యవహరింపవలె. ఎంతవారలైనను కర్మఫలమనుభవింపక తప్పదుకదా! శ్రీసాయికరుణా...

సాయి కథలు - గురివింద , పరనింద !

Image
శ్రీసాయినాథాయనమః సాయి కథలు - గురివింద , పరనింద !  " తప్పులెన్నువారు తండోపతండంబు ఉర్విజనులకెల్ల వుండు తప్పు తప్పులెన్నువారు తమతప్పు నెరుగరు విశ్వదాభిరామ వినురవేమ "                   వేమన శతకము " ధర్మాచరణలో ఆత్మవిమర్శనమొక్కటే తగియున్నది. సాటివారి గుణదోషాలు నిరంతరం చింతించడంవల్ల అది, నిజమైనా అబద్ధమైనా సాయి అందరిలో వున్నాడనే వివేకాన్ని కోల్పోయి మనస్సు నిరంతరం రాగద్వేషాలకు నిలయమవుతుంది. ఇక ప్రేమ, కరుణలకు చోటెలా లభిస్తుంది? "  ఆచార్యవాణి  గురివింద  తననలుపుచూడకయే యితరులను  వెక్కిరించుననుట అందరెరిగిన సామెత.  యోగి వేమన కూడా అదే సత్యవాక్యాన్ని పద్యరూపంలో బోధ పరచారు. తప్పులు జేయటం లోకజనులందరికి  సహజమైనప్పటికి, సామాన్యులు యితరుల దోషములెన్నుటలో సంతోషపడతారుగాని తమ తప్పును గ్రహింపలేకపోవడం ఓ లోక విచిత్రం. శ్రీశిరిడీసాయినాథులుగూడ అదే సత్యాన్ని వేరొకరూపంలో వివరించిన సంఘటనను శ్రీసాయిసచ్చరిత్రము 18-19 అధ్యాయాల ముగింపులో చూస్తాము. ఆవివరాలనొకపరి పరిశీలిద్దాం.  శిరిడీలో ఒకనాడొకభక్తుడు వేరొక భక్తు...

సాయి కథలు - సాయియే గణపతి !

Image
శ్రీసాయినాథాయనమః  సాయి కథలు - సాయియే  గణపతి  ప్రియ పాఠకులందరికి వినాయకచవితి శుభాకాంక్షలు!  శ్రీసాయినాథులు సర్వ దేవతా స్వరూపులని భక్తులకు అనుభవము కలిగించారు. రామునిగా, కృష్ణునిగా, పాండురంగనిగా, దత్తాత్రేయునిగా మరెన్నో దేవరూపులుగా  భక్తులెందరో సాయిని గాంచారు. ఇదేక్రమంలో తామే గణపతియని  కొందరి శ్రద్ధాళువులకు తెలియబలికారు. శ్రీసాయిసచ్చరిత్రము రచయిత హేమాడ్ పంతు సాయిని గణపతిగా స్తుతించాడు. ఇచట కొందరి అనుభవముల పరిశీలిద్దాము. " చిదంబరరావు గాడ్గిల్ అనే గణపతి భక్తుడు శిరీడీ దర్శించినప్పటినుండి యింటిదగ్గర బాబాను గణపతిగా పూజించేవాడు. ఓ రోజతడు శిరిడీ వచ్చినపుడు సాయి నవ్వి , ' ఈ ముసలాడు చాల టక్కరి. ఎలుకే నావాహనమని కనిపెట్టాడు ' అన్నారు. ఒకసారి బాంద్రానుండి ఒకామెవచ్చి సాయికి నమస్కరించి ఆయన యెదుట కూర్చోగానే , ఆమెను 7 సంవత్సరములుగా వేధిస్తున్న తలనొప్పి తగ్గిపోయింది. ఆమాట చెప్పగానే బాబా, ' అమ్మా నీచిన్నతనమునుండి నాకు సమృద్ధిగా అన్నీ తినబెడుతున్నావు ' అన్నారు. ఆమెకేమీ అర్ధం కాలేదు. బాబా నవ్వుతూ,  ' నీవెవరిని  పూజిస్తావు' అన్నారు. గణపతిని పూజిస్తానని చెప్పిం...