Posts

Showing posts from October, 2019

సాయి కథలు - సాయిసన్నిధి, చిక్కుముడి పరిష్కారము

Image
శ్రీసాయినాథాయనమః  నేడు పరమపూజ్య శ్రీ ఎక్కిరాల భరద్వాజగారి జయంతి సాయి కథలు - సాయిసన్నిధిలో చిక్కుముడి పరిష్కారము " మహాత్ముల కథలు వినుటయనగా వారి సాంగత్యము చేయుటే " శ్రీ సాయి సచ్చరిత్రము  సాయి భక్తులచే  ప్రేమగా పిలవబడే సాయిమాస్టారు ( శ్రీ ఎక్కిరాల  భరద్వాజ)  గారి చిన్ననాటి అనుభవమిది.  కౌమారదశనుండి వారిని  ఓ ప్రశ్న నిత్యం వేధిస్తూ ఉండేదట, వివరాల్లోకెళదాం. ఇది ధర్మానికి సంబంధించిన సందేహం. విషయానికొస్తే రామాయణ గాథలో శ్రీరామచంద్రుడు ధర్మాచరణకు మారుపేరు, ఆయనకు సకల శాస్త్రాల, ధర్మాల విశేష జ్ఞానముంది. రాజ్యాభిషేకానికి సంబంధించి,  రాజు తదనంతరము రాజ్యము పెద్దకొడుకునకు సంక్రమింపవలె. కాని తండ్రి దశరథుడు తన మూడవ భార్య కైకేయి కిచ్చిన మాటచే భరతునకు రాజ్యం సంక్రమిస్తుంది. ధర్మపరంగా, న్యాయపరంగా రాజ్యాధికారానికి  తామే అర్హులమని శ్రీరామునకు తెలిసినప్పటికీ, పితృవాక్య పరిపాలన ( పెద్దలమాటను పాటింపవలె ) ననెడి మిషచే భరతుని రాజునిజేసి తాను సీతా లక్ష్మణ సమేతంగా వనవాసానికెళ్తాడు. ఈ ఘటన రామాయణ కాలంలో జరిగిన సంగతి అందరికి తెలిసిన విషయమే. ఇపుడు మహా...

సాయి కథలు - " నా ఖజానా నిండుగా నున్నది "

Image
శ్రీసాయినాథాయనమః  పాఠకమహాశయులెల్లరకు దీపావళి శుభాకాంక్షలు! సాయి కథలు -  " నా ఖజానా నిండుగా నున్నది " " మహాత్ముల కథలు వినుట యనగా వారి సాంగత్యము చేయుటే ! " శ్రీ సాయి చరిత్రము " నా ఖజానా నిండుగా నున్నది " ఈ మాటాలన్నదెవరో కాదు, సాక్షాతూ సద్గురు సాయిబాబానే! వేరు వేరు సందర్భాలలో బాబా భక్తులతో చెప్పిన మాటల పరిశీలిద్దాము. "  నా ఖజానా నిండుగా నున్నది. ఎవరికేది కావలసిన దానిని వారికివ్వగలను. కాని వాని యోగ్యత నేను మొదట పరీక్షించవలెను. " శ్రీ సాయి సచ్చరిత్రము 16-17 అధ్యాయములు. "  నాసర్కారు యొక్క ఖజానా ( ఆధ్యాత్మిక ధనము ) నిండుగా నున్నది. అది యంచువరకు నిండి పొంగిపోవుచున్నది.  నేను ' త్రవ్వి ఈధనమును బండ్లతో తీసుకపొండు. సుపుత్రుడైనవాడు ఈ ద్రవ్యము నంతయు దాచుకొనవలెను.' అనుచున్నాను. " 32వఅధ్యాయము. బాబానుగూర్చి పూర్తిగా తెలియనివారికీమాటలు బహు వింతగా తోచవచ్చును. చూచువారలకు బాబా యొక్క సంపద  తేటతెల్లము. వారికున్నదల్లా చిరిగిపోయిన కఫ్ని, తలగుడ్డ, భిక్షాపాత్ర, తంబిరేకు డబ్బా, సటకా, చిలుంగొట్టం, కొద్దిపాటిపొగాకు; వారు నివసించేది పాతమజీదు,  కలసి ...

సాయి కథలు - శ్రీ బి.వి. నరసింహస్వామిగారి అనుభవం

Image
శ్రీసాయినాథాయనమః  సాయి కథలు - శ్రీ బి.వి. నరసింహస్వామిగారి ( జననం 21-08-1874 , సాయిలోక ప్రాప్తి 19-10-1956 ) అనుభవం " మహాత్ముల కథలు వినుట యనగా వారి సాంగత్యము చేయుటే ! "  శ్రీ సాయి సచ్చరిత్రము  సాయిబాబా జీవించియున్నపుడు వారి మహిమలను దాసగణు మహరాజ్ తన శ్రావ్య కీర్తనలద్వారా, నానాసాహెబ్ చాందోర్కర్ తమ ఉపన్యాసములద్వారా దూరప్రాంతములకు వ్యాపింపజేశారు. సాయి సమాధి చెందిన పిమ్మట 1936వ సంవత్సరమునుండి షుమారు 1956 వరకు భారత దేశంలో నలుమూలలా బాబాఖ్యాతి వ్యాప్తిచెందుటలో అత్యంత కీలకబాధ్యత వహించినవారు శ్రీ బీవీ నరసింహస్వామిగారు. వీరు మద్రాసులో అఖిలభారత సాయిసమాజ్ సంస్థను  స్థాపించి, సాయిసమాజ్ కేంద్రంగా విశేష సాయి ప్రచారం తమ చివరి క్షణం వరకు కొనసాగించారు. అంతటి  పరమభక్తులగుటకు దోహదపడిన వారి అద్భుత   జీవితానుభవం  పరిశీలిద్దాం.  శ్రీ నరసింహ స్వామి 21ఆగష్టు , 1874న తమిళనాడులోని కోయింబత్తూర్ జిల్లాలో సనాతన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు.  అత్యంతప్రతిభతోగూడిన   విద్యాభ్యాసానంతరము  1895లో సేలం లో తమ న్యాయవృత్తిని ప్రారంభ...

సాయి కథలు - ఎంతటి దయామయులో మహాత్ములు!

Image
శ్రీసాయినాథాయనమః   సాయిబాబా మహాసమాధికి(అక్టోబరు 15, 1918)  కొన్నిరోజులముందు తీసిన చిత్రం  సాయి కథలు - ఎంతటి దయామయులో మహాత్ములు! " మహాత్ముల కథలు వినుట యనగా వారి సాంగత్యము చేయుటే ! "  శ్రీ సాయి సచ్చరిత్రము  భగవంతుడు తాను సృష్టించిన జగతిని ఉద్ధరించుటకు  సద్గురువుల, మహాత్ముల రూపంలో తానే  అవతరిస్తాడనేది  ఆర్యవాక్కు.  సద్గురువులు సాక్షాత్తు దైవరాయబారులు. యోగులు తమ ప్రతిరూపులని  శ్రీకృష్ణుడు తెలిపియున్నాడు. జీవులపట్ల హద్దులెరుగని  కారుణ్యము,  అతిశయించిన ప్రేమానురాగాలతో సద్గురువులు ఆవిర్భవిస్తారు. వారు మానవజాతిని ఉన్నత మార్గంలో నడిపిస్తూ, వారి యోగక్షేమాల బాధ్యతను గూడ వహిస్తారు. అనుభవింపలేని భక్తుల పాపకర్మల, బాధల తామనుభవించి వారికి  బాధోపశమనం కలిగిస్తారు. ఈలక్షణాలు సాయిబాబాలో పరిపూర్ణంగా గోచరిస్తాయి. ఇలాంటి తత్వమే రామకృష్ణ పరమహంస మరియు రమణమహర్షి జీవితచరిత్రలలో   మిగుల  ప్రతిబింబిస్తుంది. ఈ సద్గురుదేవుల కారుణ్య తత్వాన్ని  క్లుప్తంగా, సోదాహరణంగా  పరిశీలించుదాం. సాయిబాబా జీవితచరిత్ర...

సాయి కథలు - ఆ సూర్యునికి వెలుగునిచ్చేదెవరు ?

Image
శ్రీసాయినాథాయనమః " నేనే జగన్మాతను ! "   సాయిబాబా  సాయి కథలు - ఆ సూర్యునికి వెలుగునిచ్చేదెవరు ? " మహాత్ముల కథలు వినుట యనగా వారి సాంగత్యము చేయుటే ! "   శ్రీ సాయి సచ్చరిత్రము  భూతలంపై నివసించే ప్రాణికోటి కెల్లరకు శక్తినిచ్చేది సూర్యుడు, ఆసూర్యశక్తిలేక జీవసముదాయం తమ మనుగడ సాగించలేదనేది  అందరికి తెలిసిన సత్యమే. మరి అలాంటి శక్తిప్రదాత సూర్యుడు తానెచటినుండి  తనశక్తిని  పొందుచున్నాడు? ఇందులకు శాస్త్రజ్ఞులు తమతమ కారణములు వివరించుచున్నారు. ఆధ్యాత్మిక పరంగా చూస్తే కఠ ఉపనిషత్తునందు  యిందులకు ఓచక్కని వివరణ మివ్వబడినది, అదేమిటో క్లుప్తంగా పరిశీలిద్దాము. ఉపనిషత్తులో యమధర్మరాజు బాలుడైన నచికేతునకు ఆత్మ తత్వమునుగూర్చి  విశేషంగా,  విపులంగా  వివరిస్తాడు. ఆసంభాషణలోని మూలభావము చూచెదము.  " నీకు ప్రకాశమెద్ది? పగటియందు సూర్యుడును, రాత్రియందు చంద్రదీపాదులును. అటులే కానిమ్ముకాని , ఆసూర్య ప్రదీపాదులను ప్రకాశింపజేయునదేది?  నేత్రము. నేత్రము మూసికొనినపుడు నీకు ప్రకాశమెద్ది? బుద్ధి.  ఆబుద్ధిని ప్రకాశింపజేయు (తెలిసికొ...

సాయి కథలు - విజయదశమి, సీమోల్లంఘనము

Image
శ్రీసాయినాథాయనమః  " నేనే జగన్మాతను ! " సాయిబాబా పాఠకమహాశయులకు విజయదశమి శుభాకాంక్షలు!   సాయి కథలు -  విజయదశమి, సీమోల్లంఘనము " మహాత్ముల కథలు వినుట యనగా వారి సాంగత్యము చేయుటే ! " శ్రీ సాయి చరిత్రము  నేడు విజయదశమి,  పవిత్రమైన పర్వదినము  విజయానినికి, వేడుకలకు సంకేతము. సీమోల్లంఘనమనగా సీమ హద్దులదాటి వెడలి  విజయంతో మరలి వచ్చుట. విజయదశమినాడు బాబా మహాసమాధి చెందిన విషయం అందరికీ తెలిసినదే. ఆరోజున బాబా తమదేహ సరిహద్దులదాటి ఎచటికో వెళ్లి మరలా సదా చైతన్యవంతులై , జాగరూకులై  మరణంపై గెలుపునొంది తమభక్త హృదయసీమలలోకి ప్రవేశిస్తున్నారు.  ఈరోజువరకు సాయిభక్తులకు నిత్యం కలిగే యనుభవాలే యిందులకు నిదర్శనము.  విజయదశమి శుభసందర్భమున శ్రీ సాయి జీవితచరిత్రలో చెప్పబడిన సీమోల్లంఘన వివరములు స్మరించుకొని బాబా ఆశిస్సులు పొందెదముగాక!  1916వ సంవత్సరము విజయదశమి సాయంత్ర  సమయాన  పెక్కుమంది శిరిడీ గ్రామప్రజలు సామూహికంగా పూజాద్రవ్యాలు తీసుకొని ,  మేళతాళాలతో ఊరి పొలిమేరకువెళ్ళి సీమోల్లంఘనము పూజజేసి వస్తున్నారు. రాజులు పూర్వం ఆరొజు దిగ్విజయ...

సాయి కథలు - సాయి శిరిడీకే పరిమితులా ?

Image
శ్రీసాయినాథాయనమః సాయి కథలు - సాయి శిరిడీకే పరిమితులా ?  " మహాత్ముల కథలు వినుట యనగా వారి సాంగత్యము చేయుటే ! "   శ్రీ సాయి సచ్చరిత్రము  సాయి శిరిడీకే పరిమితులా ?  ఈ ప్రశ్నకు సమాధానం శ్రీసాయిసచ్చరిత్రము 31వ అధ్యాయంలో లభిస్తుంది. బాలారామ్ మాన్ కర్ యనునాతడు తనభార్య మరణానంతరము విరక్తిచెంది, గృహబాధ్యతలను కొడుకు కప్పగించి మనశాంతికై  శిరిడీ బాబా  వద్దకు వస్తాడు. కాని బాబా వానికి 12 రూపాయలనిచ్చి సతారా జిల్లాలోని మచ్చింద్రగఢ్ కు అతని ఇష్టానికి వ్యతిరేకంగా  పంపుతారు. అచటి ప్రకృతికి, పరిసరాలకు మిగుల ముగ్ధుడౌతాడు. బాబా ఆదేశంపై   రోజుకు మూడుసార్లు తీవ్రంగా ధ్యానం చేస్తాడు. కొన్నిరోజుల తర్వాత బాబా వానికి మెలకువలో,  భౌతికంగా  దర్శనమిచ్చారు. శిరిడీలో వానిమనసు నిలకడ పొందకుండుటచే గఢ్ కు పంపామని, కేవలం తాము  శిరిడీలోనే యుంటామనే యాతని భ్రమతొలగించి, సర్వత్రా వ్యాపితులమనే అనుభవమిచ్చుటకై భౌతికంగా కన్పించామని చెబుతారు. కొంతకాలం పిమ్మట మాన్ కర్ శిరిడీజేరి సాయిసన్నిధిలో తుదిశ్వాస విడుస్తాడు.   దేవీనవరాత్రులలో ని  ఈరోజ...

సాయి కథలు - అష్టసిద్ధులు

Image
శ్రీసాయినాథాయనమః సాయి కథలు - అష్టసిద్ధులు " మహాత్ముల కథలు వినుట యనగా వారి సాంగత్యము చేయుటే ! "   శ్రీ సాయి సచ్చరిత్రము  భగవత్ప్రాప్తికి ఋషులు వివరించిన యోగ  మార్గములలో రాజయోగమొక మార్గము. షుమారు 5 వేల సంవత్సరాలకు పూర్వము పతాంజలి మహర్షిచే సంకలీకరింపబడిన రాజయోగము( పతాంజలి యోగసూత్రములు ) నకు అష్టాంగయోగమనియు పేరుగలదు. ఇందు 8 భాగములున్నవి. అవి వరుసగా యమ, నియమ, ఆసన, ప్రాణయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. పతాంజలి యోగసూత్రముల ననుసరించు సాధకులు చివరిదశ యైన సమాధిస్థితి పొందుసమయమునకు పెక్కు సిద్ధులు లేక శక్తుల పొందెదరు. వానిని అష్టసిద్ధులని యంటారు.  అష్టసిద్ధులు 8, అవి వరుసగా అణిమ: అనుమాత్రపు లేక అంతకంటే తక్కువ పరిమాణము పొందుట, అనగా అతిసూక్ష్మ రూపము దాల్చుట ( సీతాన్వేషణలో హనుమ ఈ సిద్ధి చూపారు) మహిమ: అత్యంత వ్యాపక రూపము ధరించుట ( శ్రీకృష్ణుని విశ్వరూప ప్రదర్శనము) గరిమ: సంకల్పమాత్రముచే అత్యంత బరువును పొందుట ( హనుమంతుని వాలమును భీముడు ఎత్తలేకపోవుట) లఘిమ: అత్యల్ప భారస్థితిని పొందుట, గాలిలో ఎగురుట మున్నగు చర్యలు ( అడ్డ బల్లపై బాబా నిదుర ) ప్రాప్తి: తా...

సాయి కథలు - సద్గ్రంథ పఠనము

Image
శ్రీసాయినాథాయనమః  మహాత్మాగాంధీ 150వ జయంతి   స్మృతి సమర్పణ ! సాయి కథలు -  సద్గ్రంథ పఠనము  " మహాత్ముల కథలు వినుట యనగా వారి సాంగత్యము చేయుటే ! "   శ్రీ సాయి సచ్చరిత్రము  సాయిబాబా సద్గ్రంథ పఠనమునకెంతో ప్రాధాన్యత నిచ్చారు. " పనిచేయి, దేవుని నామముచ్చరించు , సద్గ్రంధముల పఠించుము"  యనెడిది వారి ప్రముఖ సందేశములలో నొక్కటి.  ఏకనాథ భాగవతము  , ఆధ్యాత్మ రామాయణము, జ్ఞానేశ్వరి, విష్ణుసహస్రనామము  మున్నగు పవిత్రగ్రంధముల చదువుటకు భక్తుల ప్రోత్సహించేవారు. వేరువేరు సమస్యలతో వారివద్దకు వచ్చిన భక్తులను పైనపేర్కొన్న గ్రంథప్రవచనములు  జరుగు ప్రదేశములకు పంపెడివారు. ఆసందర్భోచిత ప్రసంగములలో భక్తుల సమస్యలకు పరిష్కారము లభించెడిది. మరియును తమలీలల పఠించి , స్మరించి వానిని లోతుగా ఆలోచించి వాస్తవభావముల గ్రహించి యాచరింపుమనెడివారు. భగవంతుడు, భాగవతము, భక్తుడు వేరు వేరు కాదని, అంతా ఒక్కరేయనేది మహాత్ముల  అనుభవ సందేశము. ఈ వాస్తవమును శ్రీరామకృష్ణ పరమహంస తమ అనుభవపూర్వకంగా గుర్తించారు *. ఓరోజు దక్షిణేశ్వరంలోని  విష్ణుదేవాలయ ముందటి హాలులో...